Home » Anantapur
కార్తీక మాసం చివరి సోమవారం పురస్కరించుకుని తాడిమర్రి మండల సరిహద్దులోని కోన మల్లీశ్వర క్షేత్రంలో ఘనంగా పూజలు నిర్వ హించారు. ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పార్న పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను కోన మల్లీశ్వర క్షేత్రానికి తీసుకొచ్చి పూ జలు చేశారు.
సహకార సంఘాలను మరిం త బలోపేతం చేయాలంటూ జిల్లా ఇనచార్జి ఆదినారాయణ సూచించా రు. స్థానిక ఎనుములపల్లి వ్యవసాయ సహకార సంఘంలో ఆదివారం 72వ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు జరుపుకున్నారు. జిల్లా ఇనచార్జి జెండా ఆవిష్కరించి, సొసైటీ అధ్యక్షుడు ఉమ్మినేని వెంకటరాముడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 19న పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మ రం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కమిషనర్ ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల సమన్వయ అధికారి వీరపాండ్యన పుట్టపర్తికి చేరుకున్నారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఈనెల19న ప్రశాంతినిల యానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీసుకార్యాలయంలోని పోలీసుకమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో బందోబస్తు నిమిత్తం వ చ్చిన 17 జిల్లాల పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై దిశాని ర్దేశం చేశారు.
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి ప్రాంతంలో ఆద్యాత్మిక వా తావరణం నెలకొల్పేందుకు మైకుల ద్వారా సత్యసాయి దివ్యనామస్మరణ చాంటింగ్ను ఎమ్యెల్యే సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రారంబించారు. స్థానిక కలెక్టరేట్ ఎదురుగా ఉన్న మహిళా పోలీసు స్టేషన ప్రాంగణంలో ఆదివారం వారు చాంటింగ్ కార్యక్రమాన్ని ప్రారం భించారు.
వైసీపీ హయాంలో ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా వృథా చేశారనేందుకు నిదర్శనమే ఈ జగనన్న కాలనీ. అధికారులు, ప్రజాప్రతినిధులు అనాలోచిత నిర్ణయాలతో జగనన్న కాలనీ అడవిని తలపిస్తోంది. తనకల్లు మేజర్ పంచాయతీ పరిధిలోని 30 పల్లెల లబ్ధిదారులకు జగనన్న కాలనీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో 140 మందికి పట్టాలు ఇచ్చారు.
మండల పరిధిలోని గౌళ్లపల్లికి విద్యుత అధికారులు ఎన్నో యేళ్లక్రితమే విద్యుత సౌకర్యం క ల్పించారు. గ్రామంలోకి మూడు వైర్లుతో విద్యుత సరఫరా అందిస్తున్నారు. అయితే గ్రామం సమీపంలో ఆ మూడు విద్యుత వైర్లకు ప చ్చని తీగలు పూర్తిగా అల్లుకుపోయాయి. వైర్ల మొత్తం కిందికి లా గేస్తున్నాయి. అయినా విద్యుత అధికారులు ఆ వైపు కన్నెతి చూసిన పాపాన పోలేదు.
మండల కేంద్రంలోని నివాస గృహాల వద్ద ఉన్న వ్యర్థాల చెత్తకు ఎవరో నిప్పు పెట్టారు. అయిఏ ఆ చెత్త నుంచి దుర్గంధం, కలుషిత వాయువులతో కూడిన పొగ వెలువడుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గాండ ్లపెంటలో నిత్యం స్వచ్ఛతా రాయబారులు వీధులలో శుభ్రం చేసి చెత్త, ప్లాస్టిక్, చెప్పులు, పేపర్లు వంటి వ్యర్థాలను ఊరి బయట ఉన్న చెరువు పక్కన దారి వెంబడి వెస్తున్నారు.
ముస్లిం మైనార్టీలకు మంచి చేసింది, చేసేది కూటమి ప్రభుత్వమేనని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజనలకు వేత నాలు చెల్లించడంతో ఆయన శనివారం అనంతపు రంలోని క్యాంపు కార్యాలయంలో ధర్మవరం ముస్లింలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
పరిశుభ్రమైన సమా జం నిర్మాణం కోసం ప్రతిపౌరుడు బాధ్యత తీసుకోవాల్సిన అవసర ముం దని కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రతినెల మూడో శనివా రం నిర్వహించే స్వచ్ఛాంధ్ర-- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మం డలపరిధిలోని జగరాజుపల్లి కేజీబీవీని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి, పాఠశాలలో చేపడుతున్న పరిశుభ్రత చర్యల గురించి తెలుసుకున్నారు.