Home » Anantapur
గణతంత్ర దినోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గ కేంద్రాలతోపాటు మండలకేం ద్రాలు, గ్రామాల్లో జరుపుకున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, విద్యాసంస్థల్లో అధికారులు, నిర్వాహకుల ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి గణతంత్ర దినం ప్రాముఖ్యతను వివరించారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా అక్రమ కొళాయి కనెక్షనలు వెలుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా కొళాయి కనెక్షనలు తీసుకుంటున్నా అ ్డడిగే వారేలేరు. సాధారణంగా మున్సిపాలిటీలో రూ.500లోపల ఇంటి పన్ను చెల్లించేవారు రూ. 1250, ఆ పైన చెల్లించేవారు రూ. 9వేలను ఆనలైన ద్వారా మున్సిపాలిటీకి చెల్లించాలి.
చట్టాలపై విద్యార్థులు అవగా హన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహిళా పోలీసు స్టేషన డీఎస్పీ ఇందిర సూచించారు. జాతీయ బాలికా దినోత్సవ సంద ర్భంగా ఎస్పీ సతీశకుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ ఇందిర శనివారం పోలీస్ సిబ్బంది, ధర్మవరం శక్తిటీం-1తో కలిసి పట్టణంలోని పద్మావతి మహిళా డిగ్రీకళాశాలలో శనివారం చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మండలకేంద్రంలో శనివారం ఖాసింస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు. ఉద యం పురుషులకు ఇరుసు ఎత్తే పోటీలు నిర్వహించారు. మొదటి దశ పోటీలలో ప్రతిభ కనబరిచిన తోపుదుర్తికి చెందిన మధుకు ప్రథమ బహుమతి రూ. 10వేలు, అరవకూరు రామంజికి రెండో బహుమతి రూ. 7వేలు, బానుకోటకు చెందిన రాజుకు మూడో బహుమతి రూ. 3 వేలు అందజేశారు.
మండలంలో ప్రసిద్ధి చెందిన పాలపాటిదిన్నె ఆంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిట లాడింది. ఈ సందర్భంగా అర్చకులు మూలవిరాట్ను ప్రత్యేకంగా అ లంకరించి పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లిం చారు.
గ్రామాల్లో ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయయమని ఎమ్మెల్యే కందికుం ట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలపరిధిలోని గూటిబైలు సమీపంలో వెలసిన తిమ్మమ్మమర్రిమాను వద్ద శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి ఆయన వివిధ సమస్యలపై వినతులు స్వీకరిం చారు.
దశాబ్దాలుగా అభివృధ్దికి నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. నేతలు మారినా తమ తరలరాతలు మారడం లేదని ప్రజలు వాపోతున్నారు. గ్రామాలకు సరైన రోడ్లు లేక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల్లోకి కనీసం అత్యవసర వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఇప్పటికీ ఉంది.
పట్టణంలోని తేరుబజారులో ఉన్న ఆర్య వైశ్య కొత్తసత్రంలో గోదారంగ నాథస్వామి కల్యాణోత్సవాన్ని శ్రీరామభజన మందిరం ఆధ్వ ర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం సుభి క్షంగా సుఖశాంతులతో ఉండా లన్న తలంపు తో ఈ కార్యక్ర మాన్ని నిర్వహించామని నిర్వాహకులు కోటి లక్ష్మీవెంకటేశ్వర్లు, దేవతా కృష్ణమూర్తి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ యువ నా యకుడు మంత్రి నారా లోకేశ జన్మదినం సందర్భంగా శుక్రవారంం కది రి పట్టణంలోని పీవీఆర్ ఫంక్షన హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పా టు చేయనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు.
ఉద్యోగభద్రత సర్క్యులర్ 1/19ను అమలు చేసే వరకు పోరాడుతామని ఎనఎంయూ రీజనల్ చైర్మన ముత్యాలప్ప, జోనల్ వైస్ ప్రెసిడెంట్ నాగశేఖర్ తెలిపారు. ఈ మేరకు జోనల్ కమిటీ పిలుపు మేరకు జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్య లపైనా, కడప డీపీటీఓ మొండి వైఖరికి నిరసనగా గత 66 రోజులుగా కడపలో నిరాహార దీక్షలు చేపట్టారన్నారు.