Home » Anantapur urban
కడపలో ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి టీడీపీ మహానాడు వేడు కలకు పెద్దఎత్తున నా యకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎ మ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆయ న శనివారం టీడీపీ జిల్లా కార్యా లయంలో పార్టీ జిల్లా అధ్య క్షుడు వెంకటశివుడు యాదవ్, నియోజక వర్గ పరిశీలకుడు లక్ష్మీనారాయణతో కలిసి అనంతపురం అర్బన నాయ కులతో సమావేశమయ్యారు.
విద్యుత శాఖ అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యానికి కొన్ని సందర్భాలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కక్కలపల్లి పంచాయతీ పరిధిలో విద్యుత సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు ఉదాహరణ. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో బీజేపీ కొట్టాల, ప్రజాశక్తి కాలనీలోని ఇళ్లకు విద్యుత సరఫరా నిలిచిపోయింది.
ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక అశోక్నగర్లోని డీఎస్ఏ ఇండోర్స్టేడియంలో యోగాం ధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ వినోద్కుమార్ ప్రారంభించారు. 11వ అంతర్జాతీ య యోగా దినోత్సవం సందర్భంగా యోగా మాసాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు.
కరెంటు షాక్తో ప్రజలు పోతేగాని సంబంధిత అధికారులు స్పందించేలా లేరని సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అన్నారు. మండలంలోని కక్కలపల్లి గ్రామ ప్రజాశక్తి కాలనీలో నెలకొన్న విద్యుత సమస్యను పరిష్క రించాలంటూ సోమవారం సీపీఎం అధ్వర్యంలో స్థానిక సబ్స్టేషన కార్యాలయం ఎదుట ధర్నా చేపటా ్టరు.
శింగనమల నియో జకవర్గం మినీ మహానాడు కార్యక్రమాన్ని కలిసికట్టుగా విజయవంతం చేద్దామని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పి లుపునిచ్చారు. అనంతపురం నగరంలోని ఆర్అండ్బీ అతిఽథి గృహంలో సోమవారం ఎమ్మెల్యేతో పాటు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన ముంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, క్లస్టర్ ఇనచార్జ్లతో మినీ మహానాడుపై సమా వేశం నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ అర్బన నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పిలుపునిచ్చారు. అర్బన నియోజకవర్గం మినీ మహానాడును మంగళవారం ఉదయం 10 గంటలకు నగరంలోని కమ్మభవనలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవా రం పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ కమ్మభవనలో మినీమహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంక టేశ్వరప్రసాద్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేశకు అనంతపురం నగర శివారులోని తపోవనం వద్ద అపూర్వ స్వాగతం పలికారు. శుక్రవారం గుత్తిలో పర్యటన ముగించుకొని నగరానికి వచ్చిన నారా లోకేశకు రెండు భారీ జగమాలలతో స్వాగతం పలికారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తన తరలివచ్చారు. అలాగే మధ్యాహ్నం జేఎనటీయూ హెలి ప్యా డ్ వద్ద ఘనంగా వీడ్కోలు పలికారు.
మండ లంలోని నసనకోట సమీ పంలో వెలసిన దుర్గాం బ దేవత ఉత్సవాల్లో భా గంగా మూడో రోజు శుక్రవారం భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు ని ర్వహించారు. అభ యాంజనేయస్వామి విగ్రహాన్ని వేదపండి తు ల మంత్రోచ్ఛారణ నడు మ పునఃప్రతిష్ఠించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులతో పాటు నసనకోట, వెంకటాపురం, గంగంపల్లి గ్రామస్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
జేఎనటీయూ స్నాతకోత్సవాలను పురస్కరించుకుని శనివారం జిల్లాకు వస్తు న్న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొ న్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆయన జేఎన్టీయూ, సూ పర్ స్పెషాలిటీ హాస్పిటల్, రైల్వేస్టేషన, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నర్ పర్యటించే అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు, రైల్వేస్టేషన వీఐపీ లాంజ్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
కాలనీలోకి వచ్చిన వర్షపు నీరు వెళ్లేందుకు వీలులేక పోవడంతో కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసు లు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిందంటే వారి అవస్థలు వర్ణతీ తం. రూరల్ మండలం కురుగుంట పంచాయతీలోని పాత కురుగుంటతో పాటు చుట్టు పక్కల గ్రామాలైన యాలేరు, మదిగుబ్బ, కామారుపల్లి ప్రాంతాల పరిధిలోని పొలాల నుంచి పారే వర్షపు నీరు వైఎస్సార్ కాలనీ నుంచి సమీపంలోని తడకలేరు లోకి వేళ్లేందుకు చిన్న పాటి వంక ఉంది.