Home » Anantapur urban
అర్హులైన సీనియర్ టీచర్లకు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలంటూ పలువురు టీచర్లు చేపట్టిన ధర్నా శనివారం మూడో రోజూ కొనసాగింది. బదిలీల ప్రక్రియ జరుగుతున్న నగరంలోని శారదాస్కూల్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. బాధిత టీచర్లకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
హామీలు అమలు చే యడం లేదని ప్రభుత్వం విమర్శలు చేస్తున్న వారికి బుద్ధి చెప్పేవిధం గా ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అ మలవుతాయని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఆమె శనివా రం మండలంలోని కక్కలపల్లికాలనీ పంచాయతీ పిల్లిగుండ్ల కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేపట్టారు.
మహానాడుతో వైసీపీ శ్రేణుల మైండ్ బ్లాక్ అయిందని, అది చూసి వారికి ఏం చేయాలో తెలి యక వెన్నుపోటు దినోత్సవం అంటూ హడావుడి చేస్తున్నారని ఎమ్మె ల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. తాము జూన 4వ తేదీన ‘విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన శనివారం మండలంలోని ఎ.నారాయణపురం పంచాయతీ సోమనాథ్నగర్ చౌరస్తా నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభించారు.
జిల్లా జైలును, ఓపె నర్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎన రాజశేఖర్ మంగళవారం తనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అక్కడ ఉన్న సదుపాయాలతో పాటు అందుతున్న వైద్య సేవలు, సమస్యలపై ఆరా తీశారు.
ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న మూ ఢవిశ్వాసాలను నిర్మూ లించేందుకు కందు కూరి వీరేశలింగం పం తులు జీవితాన్ని, ఆ యన రచనలను మ నం చదవాలని తెలు గు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఆయన చూపిన మార్గంలో నడవాలని పేర్కొన్నారు. నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు 106వ వర్ధంతిని మంగళవా రం తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని విశాలాంధ్ర బుక్ హౌస్లో నిర్వహించారు.
రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన సర్ థామస్ మన్రో అనంత ఆత్మబంధువుగా ప్రజ ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సీనియర్ రచయిత డాక్టర్ పతికి రమేష్ నారాయణ అన్నారు. మర్రో 264వ జయంతిని పురస్క రించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ కూడలి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యోగాతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని యోగాంధ్ర క్యాంపెయిన నోడల్ ఆఫీసర్ డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. యోగాంధ్ర క్యాంపియనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం తరఫున బారీ అవ గాహన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని డీఎంహెచఓ ప్రారంభించారు.
ఉపాధ్యాయుల బదిలీల్లో ఇనసర్వీస్ బీఈడీ టీచర్లకు అవకాశం కల్పించాలని ఎంఈఎఫ్ నాయకు లు డిమాండ్ చేశారు. శనివారం ఆ సంఘం జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ ఇతర నాయుకులు డీఈఓ ప్రసాద్బాబును కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్జీటీలుగా పనిచే స్తూ.. ఇనసర్వీస్లో బీఈడీ కోర్సు చాలా మంది టీచర్లు చేస్తున్నారన్నారు.
మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా ఉంది. చాలా ఏళ్ల క్రితం నిర్మించడంతో తారురోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. మండల కేంద్రమైన రాప్తాడు నుంచి గంగలకుంట రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 44వ, 42వ జాతీయరహదారులకు పక్కనే ఉన్న ఈ గ్రామానికి రోడ్డు గుంతల మయంగా ఉంది.
జిల్లాలో మునగ పంట సాగును ప్రోత్స హించా లని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన శనివారం కలెక్టరట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో స మావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా కలె క్టర్ మాట్లాడుతూ ము నగలో అద్బుతమైన పోషకాలు ఉన్నాయన్నారు.