Home » Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) పై తెలంగాణలోని(Telangana) మొఘల్ పురా పోలీస్ స్టేషన్లో(Moghalpura Police Station) కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అసలు అమిత్ షా పై ఎందుకు కేసు నమోదు చేశారో చూద్దాం..
Telangana: కేంద్రహోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు అయ్యింది. ఈకేసులో TPCC సోషల్ మీడియా టీమ్ మెంబర్స్ పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీష్, నవీన్, ఆస్మా తస్లీమ్, గీతలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చరగా.. వారికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. పది వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయ్యింది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసును ఢిల్లీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. నిన్నటి నుంచి ఢిల్లీ పోలీసుల బృందం హైదరాబాద్లోనే మకాం వేసింది. ఈ రోజు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర చివరకు కాంగ్రెస్ అన్వేషణ యాత్రగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎద్దేవా చేశారు.
బడాబాయ్(మోదీ), చోటాబాయ్(రేవంత్రెడ్డి) కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) సంచలన ఆరాోపణలు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కూడా అచ్చంగా బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న డిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. సర్వేల్లో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా గణనీయంగా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతోందన్నారు. 5, 6, 7 తేదీలలో నేతలంతా ఇంటింటికీ తిరగాలన్నారు. 12 సీట్లలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని అమిత్ షా తెలిపారు.
హైదరాబాద్ లోక్సభ నియోజవర్గంలో ఈసారి రజాకార్ల ప్రతినిధిని ఓడించాలని, బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. 40 ఏళ్లుగా హైదరాబాద్ నుంచి పార్లమెంటులో రజాకార్ల ప్రతినిధి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఎంఐఎం