Home » America
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి ట్రంప్ పేరుతో ఈ సందేశం వచ్చింది.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సన్నిహితుడైన జనరల్ జాంగ్ యూక్సియా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో అత్యున్నత్త స్థాయి అధికార హోదాలో ఉన్నారు. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన చైనా అణు రహస్యాలను అమెరికాకు లీక్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
చైనాతో ఎలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉండదని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. హద్దుల్లేని దిగుమతులకు తాము ద్వారాలు తెరవట్లేదని తేల్చి చెప్పారు. ట్రంప్ సుంకాల బెదిరింపుల నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ట్రంప్ జారీ చేసిన హెచ్చరికతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ దుర్బేధ్యమైన భూగర్భ బంకర్ లోకి వెళ్లిపోయారు. ఈ బంకర్లో టన్నెల్స్ సిరీస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని టెహ్రాన్లోని పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్లు సమాచారం.
హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టు వార్తలు వెలువడటంతో లబ్ధిదారులు అనేక మంది అయోమయ స్థితిలో పడిపోయారు. దరఖాస్తుల పరిశీలన బ్యాక్లాగ్స్ భారీగా పేరుకుపోవడంతో సాధారణ స్లాట్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం అనర్థాలకు దారి తీస్తుందని అధికారులు చెప్పినా పట్టించుకోవడం లేదు. విమానాశ్రయంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల కాల్పుల్లో ఓ వ్యక్తి మరణించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అతడి వద్ద ఉన్న తుపాకీని తీసుకునే క్రమంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. మృతుడి కుటుంబం మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తోంది.
భారత్పై విధించిన సుంకాలను అమెరికా సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. జార్జియా రాష్ట్రంలో లారెన్స్ విల్లే సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో భారతీయ పౌరుడు సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. ఈ మంచు తుఫాను కారణంగా అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది కష్టాలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు, వర్షం కురుస్తున్నాయి. రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.