Home » America
ఇరాన్ చేసిన దాడిలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు వార్తలు వస్తున్నాయి. అమెరికాకు చెందిన ఐదు రీ ఫ్యూయలింగ్ విమానాలు ఇరాన్ దాడిలో ధ్వంసమైనట్టు వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇటీవల సౌదీ అరేబియాలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఇమిగ్రేషన్ ప్రయోజనాలను పొందడం కోసం ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారనే ఆరోపణలపై అమెరికాలో 11 మంది భారతీయ పౌరులను అరెస్టు చేశారు. వారు వీసా మోసానికి కుట్ర పన్నారనే అభియోగం మోపారు.
పశ్చిమాసియాలో యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇరాన్ చమురుకు వ్యూహాత్మక హబ్గా ఉన్న ఖర్గ్ ఐలాండ్పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు జరిపినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు.
ఇరాన్ సుప్రీం లీడర్గా ఎవరు పగ్గాలు చేపట్టినా తమ తదుపరి టార్గెట్ అయనే అవుతారని ఇంతకుముందే ప్రకటించిన అమెరికా ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కానీ, ఆయనకు సంబంధించిన కీలక సమాచారం కానీ అందించిన వారికి భారీ రివార్డు ప్రకటించింది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, గుర్తుపట్టలేనంతగా మారినట్టు తెలుస్తోందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు.
అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 ఏరియల్ ట్యాంకర్ శుక్రవారంనాడు పశ్చిమ ఇరాక్లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని ఆరుగురు సిబ్బందిలో నలుగురు మృతి చెందినట్టు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఎక్కువ అవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతం రావణ కాష్ఠాన్ని తలపిస్తోంది
రష్యా చమురు కొనుగోలుకు అమెరికా స్వల్పకాలికంగా అనుమతించింది. సముద్రంలో నిలిచిపోయిన చమురును కొనుగోలు చేసేందుకు ఏప్రిల్ 11 వరకు అవకాశమిచ్చింది.
అమెరికా, ఇజ్రాయెల్తో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే, అందుకు మూడు షరతులు విధించింది.....
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తయింది.