Home » America
వెనెజువెలా ఆపద్ధర్మ అధ్యక్షురాలు డెల్సీ రోడ్రీగెజ్ అమెరికా తీరును ఎండగట్టారు. దురాశతో అమెరికా తమ దేశ వనరులపై దృష్టి సారించిందని పార్లమెంటును ఉద్దేశించి తాజాగా వ్యాఖ్యానించారు.
రష్యా జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఇటీవల అమెరికాకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే, ఈ నౌకలో ముగ్గురు భారతీయులు కూడా ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు వెలువడ్డాయి.
అమెరికా చర్యతో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పుతిన్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గత నెలలో వెనెజువెలా వైపు వెళ్తున్న ఎం/వీ బెల్లా-1 నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా కోస్ట్ గార్డులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మెహరించింది.
అమెరికా సైనిక దళాలు వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం రాజధాని కారకాస్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పశ్చిమ దేశాలు వ్యవహరించిన తీరును విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ తప్పుబట్టారు. ఆపరేషన్ సిందూర్పై వచ్చిన రియాక్షన్స్ గురించి తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పశ్చిమ దేశాలు తమకు లాభం ఉంటే తప్ప ఏ పని చేయటం లేదని అన్నారు.
తాజాగా నికోలస్ మదురోను, ఆయన భార్య సిలియాను అమెరికా అధికారులు న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో మదురో తన వాదనలు వినిపిస్తూ.. తాను ఏ తప్పూ చేయలేదని, తనను కిడ్నాప్ చేశారని జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చారు.
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న 27 ఏళ్ల ఓ భారతీయ యువతి మాజీ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. మాజీ ప్రియుడు ఆమె అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. హత్య అనంతరం ఇండియాకు పారిపోయి వచ్చాడు.
అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగమ్మాయి నిఖిత చివరి మాటలు గుర్తుచేసుకుని తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని అన్నారు.
నికిత మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీసుకున్న అప్పు తిరిగి అడిగినందుకు అర్జున్ అతి దారుణంగా నికితను చంపేసినట్లు తెలుస్తోంది. అర్జున్ నికితనుంచి 4500 డాలర్లు తీసుకున్నట్లు సమాచారం.