Home » Amaravati
రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని గుంటూరు జిల్లా వెంకటపాలెంలోని టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి జగన్నాథ రథయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం వెంకటపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించే జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ ఐదేళ్లూ విధ్వంసం జరిగిందన్నారు.
అంగన్వాడీలకు సరఫరా చేసే గుడ్లు మరీ చిన్నబోయాయి. కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం వాటిని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.
జేఎన్టీయూలో ఆరువేల సర్టిఫికెట్ల మిస్సింగ్ వ్యవహారాన్ని అధికారులు తేలికగా తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ట్రంకు రోడ్ల నిర్మాణంలో నివాసాలను కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవన భృతిని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించింది.
రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ (గొడ్డలి పార్టీ) ఇప్పటికీ కుట్రలు కొనసాగిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి 99.5 శాతం మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇవ్వని అరశాతం మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.