Home » Amaravati
చిటపట కాలుతున్న కమ్మని వాసన.. వేగిన గింజల గళగళలు.. టప్టప్మంటూ ఒక్కొక్క గింజనే పగలగొడుతున్న శబ్దాలు.. ప్రత్యేకించి యంత్రాల సందడి.. ఇలా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎవరి పనుల్లో వారు బిజీగా కనిపిస్తారు. అతి ఖరీదైన గింజల్ని.. అతి కష్టం మీద ఉత్పత్తి చేసే శ్రమైక జీవన సౌందర్యం చూపరులను అబ్బురపరుస్తుంది.
కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బీసీల పక్షపాతి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న భక్త కనకదాసు జయంతి వేడుకలు, విగ్రహావిష్కరణ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
తిరుమలలో కొంతమంది ప్రజాప్రతినిధుల పీఆర్వోలు అధిక ధరలకు వీఐపీ బ్రేక్ దర్శనాలను అమ్ముకుంటున్నారని ఈశ్వర్(అనంతపురం) అనే భక్తుడు ఈవో అనిల్కుమార్ సింఘాల్కు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో శుక్రవారం పలువురు భక్తులు ఈవోతో ఫోన్లో సంభాషించారు.
తిరుపతి లో గురువారం అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. సింగాలగుంటలో దాదాపు ఐదారు గంటల పాటు ఆరుగురు యువకులు, విద్యార్థులు హల్చల్ చేశారు. కనకభూషణ లేఅవుట్లో ఆరు కార్లు అద్దాలు ధ్వంసం చేశారు. పక్కనే వున్న విద్యుత్ శాఖ సబ్స్టేషన్ కార్యాలయ కిటికీ అద్దాలు, తలుపులు ధ్వంసం చేశారు.
హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ 17 ఏళ్ల బాలికను అదే కళాశాలలో సీనియర్గా చదువుకుంటున్న యువకుడు ప్రేమ పేరుతో తల్లిని చేశాడు. ఆ బాలిక గురువారం ఆసుపత్రిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కడపలోని వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్లి తిరిగి హాస్టల్కు వస్తుండేది.
విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేపధ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.
మండలంలోని గొళ్లపల్లి పంచాయతీ పరిధిలోని గుడిసివారిపల్లి వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన శుక్రవారం కలకలం రేపింది. అవివాహితుడైన యువకుడిని విచక్షణారహితంగా తలపై కొట్టి చంపి పడేసినట్లు తెలియడంతో గొళ్లపల్లి చుట్టుపక్కల జనం ఉలిక్కిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
వందే భారత్ రైలు పది రోజుల్లోపు హిందూపురంలో ఆగుతుందని ఎంపీ బీకే పార్థసారథి తెలిపారు. హిందూపురానికి వచ్చిన ఆయన విలేకరలుతో మాట్లాడారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తాను రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నతో మాట్లాడామని తెలిపారు.
‘నా భర్తను మా అత్త, బావ చంపేశారు. పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు’ అంటూ బాధితురాలు హేమలత ఎస్పీ సుబ్బరాయుడు ఎదుట సోమవారం పీజీఆర్ఎస్లో మొర పెట్టుకున్నారు. ‘మాది వడమాలపేట మండలం ఎస్బీఆర్పురం. సత్యవేడు మండలం మాదనపాలేనికి చెందిన కృష్ణకుమార్తో 2023లో నాకు వివాహమైంది. నా భర్తకు అన్న కిరణ్కుమార్, సోదరి అశ్విని ఉన్నారు.