Home » Amaravati
అనంతపురం జిల్లా గుంతకల్లు-మార్కాపురం రోడ్డు మధ్య త్వరలో ప్యాసింజరు రైలు నడవనుంది. ఈ మేరకు రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రైలు ఏర్పాటు ద్వారా ఇక్కడి ప్రజలు తమ రాకపోకలను ఇక సులభతరం చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఈ రైలు ప్రారంభం కానుంది.
అమరావతిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు కోసం ఖరారు అయిన టెండర్ పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఆ పిల్ను విచారించిన హైకోర్టు కొట్టేసింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల పేరుతో జరిగిన ఉన్మాదంపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. జగన్ ఫొటో పట్టుకుని రప్పా రప్పా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు భీభత్స చేశారు. అలాగే మరికొంతమంది రక్తతర్పణం అంటూ అలజడులు రేకెత్తించారు. అయితే.. దీనిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై బిజీబిజీగా ఉండే ఎమ్మెల్యే పరిటాల సునీత ఒక్కరోజు తన పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. వెంకటాపురం వద్దగల తమ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం చలిలోనే వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి అప్పుడే పనుల్లోకి వస్తున్న కూలీలతో మమేకమయ్యారు.
అనంతపురం జిల్లాలోని హిందూపురం వాసులకు గుడ్న్యూస్.. ఈనెల 27నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆగనుంది. యశ్వంత్పూర్ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్ రైలు.. 27వతేదీ నుంచి హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీంతో ఈ ఏరియా వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్గా ఎదిగిందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి దారితీశాయి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు రప్పా.. రప్పా అంటూ జగన్ ఫోటోలను పట్టుకొని వీధుల్లో తిరగడం ఇప్పుడు వివాదాలు చోటుచేసుకున్నాయి. దీనిపై పొలీసులు సైతం కేసులు నమోదు చేస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపాయి. మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...
క్వాంటం టాక్’ కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. వేల మంది టెక్ విద్యార్థులతో ఆన్లైన్లో సీఎం ‘క్వాంటం టాక్’లో మాట్లాడనున్నారు.