Home » Amaravati
పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మండలంలోని గూటిబైలు గ్రామం వద్ద తిమ్మమ్మ మర్రిమాను ఉంది. చెట్టు వద్దగల తిమ్మమాంబ ఘాట్లో ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు.
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
పందుల వ్యాపారంలో నష్టపోయిన కుటుంబం సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీలను ఎంచుకుంది. కుటుంబికులంతా కలిసి గ్రామాల్లో బొమ్మలాట ఆడించేవారు. అదే క్రమంలో తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేసేవారు.
అసెంబ్లీ సమావేశాలు మొదలైన నేపథ్యంలో మంత్రుల పనితీరు, ప్రవర్తనపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గదర్శకాలిచ్చారు. సమయపాలన ఉండాలని, బాధ్యతాయుత ప్రసంగాలు చేయాలని.. అసెంబ్లీలో 'ఆవు కథలు' చెప్పవద్దని సూచించారు.
కోడి కత్తితో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన లింగమయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతోపాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు.
గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(మిర్చియార్డు) నూతన పాలకవర్గం నియామకం పూర్తి అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార(మార్కెటింగ్) శాఖ సోమవారం అధికారికంగా జీవో నంబరు 89ని విడుదల చేసింది.