Home » Amaravati
నగరంలోని క్లాక్ టవర్ ఫ్రైఓవర్ వంతెనపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తపోవనం ప్రాంతానికి చెందిన దూదేకుల మస్తాన్ వలి(32)దుర్మరణం చెందాడు.
మద్యం ఫుల్గా తాగిన ఓ మందుబాబు జిల్లా కేంద్రంలోని ప్రశాంతిగ్రామ్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడు. వివరాల్లోకి వెళితే.. బుధవారం ప్రశాంతిగ్రామ్లో ఓ యువకుడు మద్యం పుల్గా సేవించి కదులుతున్న కారుటా్పపై పడుకుని రోడ్డుకు ఇరువైపుల ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు.
డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ బెదిరింపులకు దిగుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు వెంకటాపురంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
డీఎస్సీ-2025 ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఈనెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. నియామక పత్రాలు అందజేసే సమయంలోనే అక్టోబరు 3నుంచి 13వ తేదీ వరకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ కమిషనర్ షెడ్యూల్ ప్రకటించిన విషయం విదితమే.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులు, కటాక్షం అందరిపై ఉండాలని నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు. 46 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. 11 రోజుల పాటు కనక దుర్గమ్మను వివిధ రూపాల్లో అలంకరిస్తారని వివరించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న బస్సులకు అదనంగా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కడప గ్యారేజీని ఆర్టీసీ ఎండీతో పాటు ఈడీఈ చెంగల్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, బస్టాండు స్థితిగతులను గురించి కడప ఆర్ఎం గోపాల్రెడ్డి, ఇతర అధికారులతో ఆరా తీశారు.
ప్రస్తుతం మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పీలేరు త్వరలో మున్సిపాలిటీగా అవతరించనున్నట్లు తెలుస్తోంది. దినాదినాభివృద్ధి చెందుతున్న పీలేరును అభివృద్ధి పథంలో నిలపాలంటే మున్సిపాలిటీగా చేయక తప్పదనే అభిప్రాయంతో ఎమ్మెల్యే నల్లారి కిశోర్కుమార్రెడ్డి ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేశారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
అన్నమయ్య జిల్లాలో 2621 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులకు సరిపడే యూరియా అందుబాటులో ఉందని రైతులు అపోహలకు గురికావద్దని తెలియజేశారు.
హిందూపురం నియోజకవర్గంలో స్మాల్స్కేల్ ఇండస్ర్టీస్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాసులును ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోరారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లిని ఆయన చాంబర్లో ఎమ్మెల్యే కలిశారు.
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి చెందిన తమన్నగారి సతీష్కుమార్ (23) తిరుపతిలో హత్యకు గురయ్యారు. ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రైలు పట్టాల పక్కన ఈ ఘాతుకం జరిగింది. తిరుపతి రైల్వే సీఐ ఆశీర్వాదం తెలిపిన ప్రకారం.. ఆర్గొండ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ఒక్కడే కుమారుడు.