Home » Amaravati
నాణ్యమైన మద్యమే వినియోదారుడికి చేరాలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొన్న వెంటనే దుకాణం వద్దే మద్యం చెక్ చేసుకునేందుకు వీలు కల్పించింది. ఈక్రమంలోనే ఓ సరికొత్త యాప్ను తీసుకువచ్చింది.
అమరావతిలో 4 స్టార్ దసపల్లా హోటల్ నిర్మాణానికి ప్రోత్సాహకాలతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.200 కోట్లతో 4 స్టార్ హోటల్ని దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనుంది.
హైటెక్ సిటీతో నాడు హైదరాబాద్... గూగుల్తో నేడు విశాఖ అభివృద్ధి చెందుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికతకు ఇదొక నిదర్శనమన్నారు.
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం కల్తీదా, నాణ్యమైనదా అన్న విషయం తెలుసుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య పేర్కొన్నారు. స్థానిక ఎక్సైజ్ స్టేషన్ను ఆయన గురువారం తనిఖీ చేశారు.
వికలాంగత్వం ఎక్కువగా ఉండి పింఛన్ రావాలంటే తనకు డబ్బు పంపాలంటూ ఓ వ్యక్తి మండలంలోని పలువురు దివ్యాంగులకు ఫోన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు 10మందికిపైగా ఫోన్ చేసి తన పేరు శివ అని, కలెక్టర్ ఆఫీసులో పని చేస్తున్నానని చెప్పి, డబ్బు వసూళ్లకు పూనుకున్నట్లు సమాచారం.
ఈడీ చేశారు. డీఎస్సీ కోసం ఆరేళ్లకుపైగా ఎదురు చూశారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహించాలన్న నిర్ణయం.. ఉమ్మడి జిల్లాలోని 1403 మంది జీవితాల్లో వెలుగునింపింది.
రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని.. రాజధాని కోసం జాగా కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.
రాజధాని పనులు రీ-స్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇది. భవనాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి పరిశీలీస్తుండగా... భవన నిర్మాణ తీరును మంత్రి నారాయణ వివరించారు.
నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకే దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం. దీంతో దీని వెనుక ఉన్న ఆఫ్రికా లింకులు కూడా బయటకు వస్తాయి. మళ్ళీ ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తా..
తిరుపతి నుంచి చెన్నై సెంట్రల్కు బయల్దేరే రైలు, తిరుపతికి బదులు తిరుచానూరు నుంచి బయల్దేరనుంది. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... మరమ్మతు పనుల కారణంగా చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి వెళ్లే అన్ రిజర్వ్డ్ రైళ్ల సేవలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.