Tirupati flight: హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభం
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:36 PM
హైదరాబాద్-తిరుపతి ఇండిగో విమాన సర్వీసు పునఃప్రారంభమైంది. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం తెలిసిందే. అయితే.. మళ్లీ ప్రారంభించారు.
రేణిగుంట(తిరుపతి): హైదరాబాద్ నుంచి తిరుపతి(Hyderabad to Tirupati) విమానాశ్రయానికి ఇండిగో సంస్థ తమ సర్వీసును పునఃప్రారంభించింది. గత ఏడాది డిసెంబర్లో దేశవ్యాప్తంగా ఇండిగో సంస్థలో తలెత్తిన సంక్షోభంతో పలు విమాన సర్వీసులు రద్దయిన విషయం విదితమే. ఈ క్రమంలో హైదరాబాద్-తిరుపతి మధ్య ఉదయం, మధ్యాహ్న సర్వీసులు డిసెంబర్ 18వ తేదీ నుంచి రద్దయ్యాయి.

ఇందులో మధ్యాహ్నం 2.25కు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతికి 3.05 గంటలకు చేరుకుని 3.25 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరే ఇండిగో విమాన సర్వీసును ఈనెల 2న శుక్రవారం నుంచి పునఃప్రారంభించారు. కాగా, శనివారం హైదరాబాద్ నుంచి 3.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం 5 గంటలకు చేరుకుంది. 5.25 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు
Read Latest Telangana News and National News