Home » Indigo
భారత విమానాయాన మార్కెట్లో 60 శాతం వాటా కలిగి ఉన్న ఎయిర్ ఇండియా(Air India) 2030నాటికి దాని సామర్థ్యాన్ని రెట్టింపు చేసి.. అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా వైట్బాడీ ఎయిర్క్రాఫ్ట్లను తొలిసారి కొనుగోలు చేస్తోంది. తాజాగా ఇండిగో A350-900 జెట్లను ఆర్డర్ చేసింది. 30 విమానాల కొనుగోలుతో పాటు, 70 అదనపు A350 విమానాల కొనుగోలు హక్కుల కోసం ఇండిగో సైన్ అప్ చేసింది.
భారత్లో 2025లో ఎయిర్ ట్యాక్సీలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వీటి సాయంతో దేశ రాజధానిలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాల్లో ప్రయాణికులను తీసుకువెళ్తుంది. అంటే ట్రాఫిక్ జామ్లకు ఫుల్ స్టాప్ పడినట్లే.
ఇండిగో విమానాల్లో ఇచ్చే ఉప్మా, పోహాల్లో ఉప్పు ఎక్కువగా ఉందంటూ ఓ హెల్త్ ఇన్ఫ్లుయెన్సర్ ఫిర్యాదుపై ఎయిర్లైన్స్ స్పందించింది. నిబంధనలకు అనుగుణంగానే తాము విమానాల్లో ఆహారం సరఫరా చేస్తున్నట్టు వివరణ ఇచ్చింది.
భారతదేశానికి చెందిన ఇండిగో(IndiGo) ఎయిర్లైన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మార్కెట్ విలువ(market capitalisation) పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ $17.6 బిలియన్లకు (సుమారు ₹1.47 లక్షల కోట్లు) చేరుకోవడంతో ఈ రికార్డును సాధించింది.
పాట్నా నుంచి అహ్మదాబాద్ బయలుదేరిన 'ఇండిగో' విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఇండోర్కు దారి మళ్లించిన ఘటన శుక్రవారంనాడు చోటుచేసుకుంది. విమానం గాలిలో ఉండగానే ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అవసరమైన సహాయాన్ని విమాన సిబ్బంది అందించినట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇండిగో తెలిపింది.
కోల్కతా ఎయిర్పోర్టులో బుధవారం భారీ ప్రమాదం తప్పింది. రన్వే పై రెండు విమానాలు అత్యంత చేరువగా రావడంతో.. వింగ్ టు వింగ్ ఢీకొన్నాయి. దీంతో.. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాల రెక్కలు విరిగాయి. ఒక విమానం చెన్నైకి వెళ్తుండగా, మరొకటి దర్భంగాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో.. ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎక్కడా జరగని వింతలు విశేషాలు ఈ మధ్య ఇండిగో(Indigo) విమానాల్లోనే జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానంలో బుధవారం ఓ వ్యక్తి బీడీ తాగి ప్రయాణికులను ఆందోళనకు గురి చేసిన ఘటన మరువక ముందే.. మరో విచిత్ర అనుభవం ఓ ప్రయాణికురాలికి ఎదురైంది.
ఇండిగో విమానం బయలుదేరడంలో జాప్యం జరగడంతో స్టార్ కమెడియన్ వీర్ దాస్ నెట్టింట పంచ్లు పేల్చారు.
కోల్కతా విమానాశ్రయంలో (Kolkata Airport) ఓ ఆందోళనకరమైన సంఘటన వెలుగు చూసింది. విమానాన్ని సరిగ్గా ల్యాండ్ చేస్తున్న సమయంలో.. పైలట్ (Pilot) కొద్దిసేపు అంధుడయ్యాడు. ఇందుకు కారణం.. లేజర్ కిరణాలే (Laser Beam). ల్యాండింగ్కి ముందు పైలట్ కళ్లలో లేజర్ కిరణాలు పడటంతో.. కాసేపు అతని కళ్లు మసకబారాయి.
ఇండిగో విమానంలో కొందరు ప్రయాణికులు వింతగా ప్రవర్తించారు. విమానం గాలిలో ఉండగానే రామ భజన చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.