• Home » Amaravati

Amaravati

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

Ananthapur News: అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..

చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

Ananthapuram News: గురువుగారి పాడు పని... విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యం

విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

TDP: దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి..

దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లండి.. అక్కడ మాట్లాడండి.. అంటూ తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సమస్యను జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో వైసీపీ నాయకులు లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు.

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌

పెనుకొండలో.. ఇస్కాన్‌ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుకానుంది. మొత్తం 60 ఎకరాల స్థలంలో రూ.425 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. కాగా.. ఈ బేస్ క్యాంపు నిర్మాణం ద్వారా ఈ బేస్‌ క్యాంప్‌ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు

Ananthapuram News: వైసీపీ నాయకుడి కంకర మిషన్‌ మూసివేత

Ananthapuram News: వైసీపీ నాయకుడి కంకర మిషన్‌ మూసివేత

అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కంకర మిషన్‌ను అధికారులు మూసివేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంలో మిల్లును మూసివేసినట్లు అధికారులు పేర్కొంటున్నా... అసలు కారణాలు వేరే ఉన్నాయనే విమర్శలొస్తున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

Ananthapuram News: బస్సు ఎక్కడానికి  వెళ్తూ...

Ananthapuram News: బస్సు ఎక్కడానికి వెళ్తూ...

బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.

NTR Statue Amaravati: అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం.. డిజైన్ల పరిశీలన..

NTR Statue Amaravati: అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహం.. డిజైన్ల పరిశీలన..

రాజధాని ప్రాంతంలోని నీరుకొండ గ్రామంలో కొండపై భారీ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విగ్రహంతోపాటు స్మృతివనం ఇతర డిజైన్లను ఫైనలైజ్ చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని సర్కార్ ఏర్పాటు చేసింది.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు

అధికారులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో బానిసలుగా పని చేయొద్దు.. భయపడి బతకొద్దు.. అని ఆయన అన్నారు. వరదయ్యపాలెంలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.

Minister Narayana: అమరావతిలో రెండో విడత భూ సమీకరణ.. ప్రారంభించిన మంత్రి నారాయణ..

Minister Narayana: అమరావతిలో రెండో విడత భూ సమీకరణ.. ప్రారంభించిన మంత్రి నారాయణ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమానులో మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి