Home » AIADMK
కుటుంబంలోని మహిళా పెద్దలకు నెలకు రూ.2,000 ఆర్థిక సాయం అందిస్తామని, పురుషులకు కూడా ఉచిత బస్సు పథకాన్ని విస్తరిస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలను నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ సోమవారంనాడు పూర్తి చేసింది. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, బీజేపీ ఎన్నికల ఇన్చార్జి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
ద్రావిడ మోడల్ డీఎంకే పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా హత్యలు జరుగుతున్నాయని, ఈ ఐదేళ్లలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధ్వజమెత్తారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్నాడీఎంకేతో సీట్ల పంపకాలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. ఇరు పార్టీల మధ్య గురువారంనాడు చర్చలు జరుగనున్నాయి.
తాను అన్నాడీఎంకేకు ద్రోహం తలపెట్టినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్సెల్వం (ఓపీఎస్) ప్రకటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత 78వ జయంతి సందర్భంగా తేని జిల్లా బోడినాయకనూరులో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలుచల్లి ఓపీఎస్ నివాళులర్పించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నాడీఎంకే హామీల వర్షం కురిపించింది. నేరుగా ఆర్థిక సాయం, సబ్సిడీల పెంపు, రుణాల మాఫీ, నిరుద్యోగులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, చిరు వ్యాపారాలను ఆదుకోవడం వంటి కీలక హామీలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే 200లకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఘనవిజయం సాధిస్తుందని బీజేపీ రాష్ట అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మరికొద్ది రోజేల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నా నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందన్నారు.
అంబుమణి రామదాస్తో కలిసి పళనిస్వామి మీడియాతో మాట్లాడుతూ, పీఎంకే చేరికతో కూటమి మరింత బలపడిందని, మరి కొన్ని పార్టీలు కూడా తమ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయన చెప్పారు. తమది విక్టరీ అలయెన్స్ అని ప్రకటించారు.
మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే పార్టీ బలహీనంగా ఉన్నా ఆ పార్టీనే తమ ప్రత్యర్ధి అని ఆయన అన్నారు.