Home » Accident
తాను చనిపోతూ.. మరో ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించింది ఓ వైద్యురాలు. రోహిణి అనే వైద్యురాలు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బ్రెయిన్ డెడ్ అవడంతో అవయవాలను దానం చేశారు. వాటిని ఐదుగురికి అమర్చారు.
తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి సముద్రతీర రహదారిలో మంగళవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యవిద్యార్థులు మృతి చెందారు. తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఓ కారులో వెళ్తుండగా ఉన్నట్టుండి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును డీకొంది.
బిడ్డను చూడకుండానే.. తండ్రి కన్నుమూసిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ధర్మవరానికి చెందిన దిలీప్కుమార్ అనే యువకుడి భార్య బిడ్డకు జన్మనిచ్చింది. అయితే.. తల్లీ బిడ్డలను చూసేందుకు ఆయన బైక్పై బయలుదేరగా.. అది అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
రష్యాలో హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు.
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఆక్షణమే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.
చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనలో తమ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు మృతిచెందడం బాధాకరమని కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ లోకపావని అన్నారు
శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండల పరిధిలోని దామాజిపల్లి వద్దగల 44వ జాతీయ రహదారిపై ఐచర్ వాహనాన్ని ఢీ కొని జబ్బర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. బస్సులో ఉన్న ప్రయాణికులపై కంకర పడిపోవడంతో 21 మంది మృతి చెందారు. దీనికి సంబంధించి ఏబీఎన్ ఏఐ వీడియో రూపొందించింది.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయడ్డారు.