Home » Abhishek Sharma
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 32 బంతుల్లో సెంచరీ చేసి విధ్వంసం సృష్టించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో భాగంగా శుక్రవారం హర్యానా, పంజాబ్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో హర్యానా గెలిచింది. సూపర్ ఓవర్లో పంజాబ్ పై హర్యానా విజయం సాధించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మను మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ హెచ్చరించాడు. అన్నిసార్లు దూకుడుగా ఆడటం పనికి రాదని స్పష్టం చేశాడు. ఆ దూకుడుతనం ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుందని తెలిపాడు.
ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించిన, విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ(163) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అభిషేక్ ధన్యవాదాలు తెలిపాడు. వారి సహకారంతోనే తాను దూకుడుగా ఆడగలుగుతున్నానని చెప్పాడు.
బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న తొలి ప్లేయర్ గా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.
టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో వికెట్ తీస్తే టీ20ల్లో 100 వికెట్లు పూర్తి చేసుకోనున్నాడు. తిలక్ వర్మ, అభిషేక్ శర్మ కూడా కీలక మైలురాళ్లకు చేరువలో ఉన్నారు. ఆస్ట్రేలియాతో జరుగనున్న ఐదో టీ20లో ఈ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉంది.
అభిషేక్ శర్మ, భారత మహిళల స్టార్ ప్లేయర్ స్మృతి మంధానకు అరుదైన అవార్డ్ దక్కింది. ఈ ప్లేయర్లకు 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్' వరించింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ అవార్డు కోసం పలువురు భారత క్రికెటర్లు పోటీలో నిలిచారు. వారిలో పురుషుల విభాగంలో యువ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ ఉండగా, మహిళల విభాగంలో స్మృతి మంధాన నిలిచింది.
దుబాయ్ వేదికగా నిన్న జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ అదరగొట్టాడు. బంగ్లాతో జరిగిన మ్యాచులో తన గురువు యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్ చేసి వావ్ అనిపించాడు.
ఆసియా కప్లో భాగంగా ఆదివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో పాక్ను మట్టికరిపించింది. ఈ విజయంలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు. 39 బంతుల్లో ఐదు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 74 పరుగులు చేసి పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు.