Home » 2025
మండలపరిధిలోని నల్ల గుట్టపల్లి తండాకు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బ్రిడ్జిపై ప్రయాణం ప్ర మాదకరంగా ఉందని గ్రా మస్థులు అంటు న్నారు. పెడబల్లి నుంచి నల్లగు ట్టపల్లికి వెళ్లే మార్గ మధ్య లో ఆర్డీటీ ఆధ్వర్యంలో పాపాగ్ని నదికి అడ్డంగా ఈ బ్రిడ్జి నిర్మించారు.
లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్ శర్మ పాల్గొన్నారు.
పట్టణంలోని కొత్తపేట సీతారామాంజినేయస్వామి కల్యాణమండపంలో శనివారం హైబ్రో చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా ఓపెన చెస్ పోటీలను ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీ చెస్ అసోసియేషన రాష్ట్ర కార్యదర్శి సుమన, టోర్నీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ చాంద్బాషా, హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ బీవీ సుబ్బారావు, డైరెక్టర్, హైబ్రో చెస్ అకాడమి నిర్వాహకులు ప్రారంభించారు.
రాజీమార్గంతోనే జీవితం సుఖమయంగా ఉంటుందని న్యాయాధికారు లు పేర్కొన్నారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి కోర్టులలో శనివారం న్యా యాధికారుల ఆధ్వర్యంలో జాతీయ మెగాలోక్ అదాలత కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మవరం కోర్టులో సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూని యర్ సివిల్ కోర్టు న్యాయాధికారి పీడీఎం నందిని పాల్గొన్నారు.
మండలకేంద్రంలో శనివా రం రాత్రి అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. బత్తలపల్లి లోని అయ్యప్ప దేవాలయంలో శనివారం ఉదయం నుంచి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరిం చిన హంస వాహనంలో అయ్యప్ప ఉత్సవమూర్తిని ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు.
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో నూతనంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం విది తమే. అయితే చాలా చోట్ల ప్రభుత్వ భవనాలను పూర్తిచేయడంలో మరి చింది. మండల వ్యాప్తంగా సచివాల యాలు పలు సచివాలయాలు నిర్మా ణ దశలోనే ఉన్నాయి. దీంతో వాటిని ఇరుకైన అద్దెగదుల్లో నిర్వహిస్తుం డడంతో ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అమడగూరు, కసముద్రం, మహమ్మదాబాద్లలో గ్రామ సచివాలయాలకు మంజూరైన భవనాలను పూర్తిగా నిర్మించారు.
మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్లో వేచి ఉండాల్సి వస్తోంది.
వాల్టా చట్టాన్ని అతిక్రమిస్తే మైనింగ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఆర్డీవో వీవీఎస్ శర్మ హెచ్చరించారు. మండలపరిధిలోని దనియానచెరువు పంచాయతీ సోమరాజుకుంట సమీపంలోని నెమళ్లగుట్టలో ఇటీవల మైనింగ్ పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికతో పాటు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దృష్టికి సోమరాజుకుంట గ్రామస్థులు తీసుకెళ్లారు.
ప్రతి మనిషీ జీవితంలో ఎంతోకొంత సమాజాభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ, పేదలకు ఆర్థికసా యం అందిస్తే మనిషి జీవితానికి సార్థకత లభి స్తుందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని వక్ఫ్ బోర్డు నుంచి మస్తానవలీ దర్గా వరకు ముతవల్లి మాణిక్యంబాబా ఆధ్వర్యంలో వంద మంది పేద, వితంతు, ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.
మండలకేంద్రంలో మూడు సచివాలయాలున్నాయి. రెండేళ్ల క్రితం ఆ మూడు సచివాలయాల సిబ్బంది వారివారి భవనాల్లో విదులు నిర్వహిం చేవారు. యేడాది క్రితం మండలకేంద్రంలో నూతనంగా సచివాలయ భవనం నిర్మించారు. ఈ భవనంలోని ఒకే గదిలో మూడు సచివాలయాల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.