Share News

MLA: ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:49 PM

లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్‌ శర్మ పాల్గొన్నారు.

MLA: ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
MLA Kandikunta Venkataprasad speaking in Prajadarbar

ప్రజాదర్బారులో ఎమ్మెల్యే కందికుంట

గాండ్లపెంట, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): లబ్ధిదారుల సమస్యలను పరిష్కామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. మండల పరిధిలోని చామాలగొంది పంచాయతీ బయ్యా రెడ్డిగారిపల్లిలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయనతో పాటు ఆర్డీవో వీవీఎస్‌ శర్మ పాల్గొన్నారు. సర్పంచ శివప్పనాయుడు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... లబ్ధిదారుల సమస్యలను స్వ యంగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ప్రజా దర్బార్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు. నేరుగా గ్రామాలకెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ ప్రజాదర్బార్‌లో ప్ర జల నుంచి వివిధ సమస్యలపై 30 ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్‌ బాబురావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామక్రిష్ణ, ఏఓ షాదాబ్‌, ఎపీఎం సూర్యనారాయణ, వైద్యాధికారి మారుతి మహేశ్వర్‌, ఏపీఓ చంద్రశేఖర్‌, వివిధశాఖలాధికారులు, ఎంపీపీ సోముశేఖర్‌రెడ్డి, జనసేన మహిళ నాయకురాలు సత్యవతి, ప్రసాద్‌, సుధాకర్‌, అక్రమ్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 13 , 2025 | 11:49 PM