• Home » 2025

2025

AD: మల్బరీ రైతులకు అవగాహన

AD: మల్బరీ రైతులకు అవగాహన

మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్‌ ఏడీ వెంకట స్వామినాయక్‌ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు

STU: ఎస్టీయూ మండల కమిటీ ఎన్నిక

STU: ఎస్టీయూ మండల కమిటీ ఎన్నిక

తలుపుల మండలం ఓబుల రెడ్డిపల్లిలోని స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో గురువారం ఎస్టీయూ మండల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా వేణుగోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా విజయవర్ధన రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, మహిళా కన్వీనర్‌ పద్మజ, మైనార్టీ కన్వీనర్‌ తబ్రేజ్‌ బాషా, జిల్లా కౌన్సిలర్లుగా రమణానాయక్‌, మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

DANCE: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

DANCE: అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక శిల్పారామంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆలరించాయి.

MINISTER: కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

MINISTER: కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి కేంద్ర జాతీయ రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన గడ్కరీ గురువారం పుట్టపర్తికి వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్‌ యాదవ్‌, బీసీ.జనారఽ్ధన రెడ్డి, కందుల దుర్గేష్‌, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, పరిటాల సునీత, ఎంఎస్‌ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ROAD: రోడ్డును ఇరువైపులా కప్పేసిన గడ్డి

ROAD: రోడ్డును ఇరువైపులా కప్పేసిన గడ్డి

మండల పరిధిలోని కమ్మ వారిపల్లి నుంచి పాత బత్తలపల్లి మీదుగా కొండేపాళ్యం వరకు రోడ్డుకు ఇరువైపుల గడ్డి ఏపుగా పెరింది. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు అంటున్నారు. ఏపుగా పె రిగిన గడ్డిని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. క మ్మవారిపల్లి నుంచి పాత బత్తలపల్లి, చండ్రాయునిపల్లి, కొండేపాళ్యం మీదుగా కదిరికి వెళ్లే ఈ రహదారి 18 కిలోమీటర్లు ఉంది.

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

CM: సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన సొమ్మును విడుదల చేసినందుకు బుధవారం టీడీపీ మండల నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభి షేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటోందన్నారు.

DANCE: శిల్పారామంలో సాంస్కృతిక సంబరాలు

DANCE: శిల్పారామంలో సాంస్కృతిక సంబరాలు

సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో భాగంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 23 వరకు శిల్పారామంలో వివిధ కళాసంస్థల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అనంతపురానికి చెందిన శ్రీనృత్య కళాని లయం శ్రీమతి సంధ్యామూర్తి కళా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

MLA: వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

MLA: వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కి సాన - అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వ్యవసాయం పె ట్టుబడి సాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతు కుం ట గ్రామంలో పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ గ్రామసభను బుఽధ వారం నిర్వహించారు.

MLA: రైతుకు వెన్నుదన్నుగా  ప్రభుత్వం

MLA: రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్ర సాద్‌ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డులో ఉన్న వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బుధవారం ‘పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడుత సహయాన్ని పంపిణీ చేశారు.

GARBAGE: చెత్తను ఎత్తివేయరూ...

GARBAGE: చెత్తను ఎత్తివేయరూ...

మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం-2 ఎదుట చెత్తపేరుకుపోయింది. దీంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారు చెత్తను, వస్తువులను తెచ్చి సచివాలయం ఎదుట పడేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి