Home » 2025
ఇమామ్లు, మౌజన లకు గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసిన కారణంగా నల్లచెరువు బస్టాండ్ కూడలిలో మండలంలోని ముస్లిం మత పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మండల పరిధిలోని ఓరు వాయి పంచాయతీ కుమ్మరవాండ్లపల్లిలో మంగళవారం మండల వ్యవ సాయ అధికారి లక్షీప్రియ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమం నిర్వ హించారు. గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు.
సమాజంలో హింసా చర్యల ను నివారించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి వెంకటేశ్వర్లు, జూనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి హరీశ పేర్కొన్నారు. స్థానిక కోర్టు హాలోలో మంగళవారం అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు.
స్వచ్ఛత కార్యక్ర మంలో భాగంగా ఎల్ఎస్డీజీ థీమ్ -5 కింద గ్రామ కార్యదర్శులతో పా టు సర్పంచలు, ఉపసర్పంచలకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివరామ ప్రసాద్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ అంజినప్ప హాజరై శిక్షణ ఇచ్చారు. ఉదయం శిక్షణ ప్రారంభంలో పంచాయతీ కార్యాదర్శులతో పాటు సర్పంచలు, ఉపసర్పంచలు పాల్గొన్నా రు.
పట్టణంలోని పార్థసారథి నగర్-2లోని 25 వార్డు సచివాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నట్లు విమర్శలు వినవస్తున్నాయి. సిబ్బంది వార్డు సచివాలయం లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అం దుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
నియోజక పరిధిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుమారు 1000 విద్యా ర్థులకు మాదిరి ప్రశ్న పత్రాల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు స్థానిక సిమ్స్ హాస్పిటల్ అధినేత నిసార్ యాసీన ఖాన, యూటీఎఫ్ సీనియర్ నాయకులు బి. మైనుద్దీన రూ.80 వేలను అందజేశారు. ఈ సొమ్మును వారు సోమవారం సిమ్స్ హాస్పిటల్ వద్ద యూటీఎఫ్ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహేర్వలికి అందజేశారు.
ఇప్పటికే అయ్యప్ప మాల ధారణ అన్నిచోట్ల ప్రారంభమైంది. అయ్యప్ప మాలధారులు దీక్షలో ఉన్న రోజుల్లో నిత్యాన్నదానం అందించి ఆదర్శంగా నిలుస్తోంది ముదిగుబ్బ శ్రీపంచగిరీశ అయ్యప్పస్వామి ఆలయ కమిటీ. గత 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోం ది.
తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో తన వంతుగా సొంత నిధులు రూ. 70వేలతో పూర్వ విద్యార్థి, జనసేన మండల కార్యదర్శి కొండబోయన సతీష్ డయాస్ నిర్మాణ పనులను చేపట్టారు.
సత్యసాయిబాబా సేవలు మరువలేనివని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని యాదవవీధిలో సత్యసాయిబాబా శతజయంతి సందర్బంగా జనసేన పార్టీ నాయకుడు రాజు ఆధ్వర్యంలో చీరల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్ర మాలకు ముఖ్యఅతిఽథులుగా జనసేనపార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి, చేనేతప్రముఖులు, టీడీపీ నాయకులు సంధా రాఘవ హాజరయ్యారు.
రైతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్, కదిరి, కొత్తచెరువు, అమడగూరు, గాండ్లపెంట, నంబులపూలకుంట, ఓబుళదేవర చెరువు, నల్లమాడ మండలాల్లో వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు సోమవారం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.