Home » 2025
పట్టణంలోని కూరగాయాల మార్కెట్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. కుళ్లిన కూరగాయాలు, చెత్తాచెదారాన్ని మార్కెట్ యార్డులో ఎక్కడపడితే అక్కడ వేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. అదేవిధంగా మార్కెట్యార్డులో సబ్రిజిసా్ట్రర్ కార్యాలయం పైభాగంలో ఉంది. ఈ కార్యాలయానికి నిత్యం ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం వె ళుతుంటారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, కావున ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని డీఎంహెచఓ ఫైరోజ్ బేగం పేర్కొన్నారు. మండలంలోని బత్తినపల్లిని ఆమె గురువారం సందర్శించారు. రెండు రోజుల క్రితం కలుషి త ఆహా రం తిని గ్రామంలోని పలువురు అస్వస్థతకు గురైన విషయంపై ఆమె గ్రామంలో రోగులతో, గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.
రైతుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమా న్ని ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని డబురువారిపల్లిలో గురువారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతన్నా మీ కోసం’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా జీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జిల్లాకేంద్రంలో హను మాన దేవాలయం లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేసిన వారు గురువారం కన్నెపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి, నవగ్రహ పూజ, గణపతిహోమం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయ్యప్పస్వాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్పాత వ్యాపారులు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది.
మండలంలోని పోతుకుం ట బీసీకాలనీ వద్ద బుధ వారం వెళ్తున్న కారు ముందుటైరు పగలడంతో రోడ్డు పక్కన ఉన్న ద్విచ క్రవాహనాన్ని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. మా మిళ్లపల్లి నుంచి ధర్మ వరం వైపు వెళ్తున్న కర్ణాట కకు చెంది న ఓ కారు వెళ్తోంది. అయితే ఉన్నఫళంగా కారు ముందు టైరు పగిలి రోడ్డుపక్కకు దూసుకుపోయింది.
పాత చట్టాలలో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా రద్దు చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని సీపీఎం పొలిట్ సభ్యుడు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు.
మండల పరిఽఽధిలోని తూ పల్లి పంచాయతీ పోరెడ్డివారిపల్లిలో బుధవారం ‘రైతన్నా మీకోసం’ కార్య క్రమం నిర్వహించారు. ఆర్డీఓ వీవీఎస్ శర్మ పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అన్నదాత సుఖీభవ రెండో విడత రూ. 7వేలు వారి ఖాతాలో జమచేసిందన్నారు. జమ కాని రైతులు వ్యవసాయ కా ర్యాలయంలో అధికారులను సంప్రదించాలని సూచించారు.
లాభదాయకమైన పంట లు సాగుచేసి అధిక ఆదాయాన్ని పొందాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి రైతులకు సూచించారు. మండలం కేంద్రమైన బుక్కపట్నంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రైతన్నా... మీ కోసం’ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొన్నారు.
స్వచ్ఛత, పరిశుభ్రత అంటూ అధికారులు ఫొటోలకు ఫోజులు ఇస్తారు కానీ ఆచరణ, ఆమలు పట్టించుకోరని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. దీంతో గ్రామాల్లో పరిశుభ్రత, చెత్త నుంచి సంపద సృష్టి, తద్వారా పంచాయతీల అభివృద్ధి అనే ప్రభుత్వ లక్ష్యాన్ని పాలకులు, అధికారులు తుంగలో తొ క్కేస్తున్నా రనే విమర్శలు వినవస్తున్నాయి.