Home » 2025
ఎస్కే యూనివర్శిటీ అంతర్కళాశాలల హాకీ విజేతగా కేహెచ డిగ్రీ కళాశాల విద్యార్థుల జ ట్టు నిలిచినట్టు ఆ కళాశాల పీడీ ఆనంద్ తెలిపారు. ఎస్కేయూ పరిధి లోని అంతర్ కళాశాలల గ్రూప్-సీ క్రీడాపోటీలను ఈనెల 21న అనం తపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించారని తెలిపారు.
భారతీయ ప్రాచీన సంప్రదాయ కళ అయిన తోలుబొమ్మల తయారీ కళకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం శ్రీసత్యసాయి జిల్లాకు గర్వకారణమని ్ల కలెక్టర్ శ్యాంప్రసాద్ అన్నారు. ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రా మానికి చెందిన తోలుబొమ్మల తయారీ కళాకారిణి శివమ్మ డిసెంబరు 9న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనలో గౌరవ రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ శిల్పగురు అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నియోజకవర్గంలో అర్హులైన వారంద రికీ అందాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండలపరిషత సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
మహిళల వినూత్న కా ర్యక్రమాలతో, వ్యాపార వేత్తలుగా రాణించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ మహిళా సంఘ సభ్యులకు సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ఫంక్షన హాలులో మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా సమాఖ్య నాలుగో వార్షిక మహాజన సభ నిర్వహించారు.
మండలకేంద్రమైన తనకల్లు, అలాగే కొక్కంటి క్రాస్లో జాతీయ రహదారి విస్తరణ కార్యక్రమాన్ని ఎని మిదేళ్ల క్రితం చేపట్టారు. అప్పట్లో కొక్కంటి క్రాస్, తనకల్లులో డివైడర్లను నిర్మించి, వాటి మధ్యలో విద్యుత స్తంభాలను ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఆ స్తంభాలకు లైట్లను కూడా అమర్చారు.
జాతీయ స్థాయి జూనియర్ జూడో పోటీలకు ధర్మవరానికి చెందిన జేవీఈ జడ్పీహెచఎస్ బాలికల ఉన్నతపాఠశాల విద్యార్థినులు ఎంపికైనట్టు కోచ ఇనాయత బాషా తెలి పారు. ఆయన సోమవారం మట్లాడుతూ... ఈ నెల 19, 20, 21 తేదీలలో కర్నూల్లోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ జూడో పోటీలు జరిగాయన్నారు.
సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.
పీఏబీఆర్ కుడికాలువ ద్వారా బత్తలపల్లి, తాడిమ ర్రి మండలాల్లోని చెరువులకు నీరు ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఐ ఆధ్వర్యంలో సోమ వారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్డీఓ మహేశకు వినతిపత్రం అందజేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరై చెక్కులను సోమవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సోమవారం స్థానిక ఆర్అండ్బి బంగ్లాలో పంపిణీ చేశారు. నియోజక వర్గంలోని 22మందికి మంజూరైన రూ. 12,28,362 లక్షల చెక్కులను అందజేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథ కానికి మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలంటూ సీపీఐఎంఎల్, బహుజనసమాజ్ పార్టీ, పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లోని గాంధీ విగ్రహం ఎదుట ఇనుప గోళాలు తలపై పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు.