Share News

MEETING: ‘ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం’

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:05 AM

సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు.

MEETING: ‘ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం’
Bhavyananda Mataji speaking at Hindu Sammelan

గాండ్లపెంట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): సమాజంలో హిందువుల ఐక్యత కోసమే హిందూ సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శ్రీకైలసనాథ ఆశ్రమ మాతాజీ భవ్యానందమాతాజీ సోమవారం పేర్కొ న్నారు. మండలపరిధిలోని మునగలవారిపల్లిలో వెలసిన లక్ష్మీ చెన్నకేశ వస్వామి ఆలయంలో సోమవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాలను, వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా వ్యవస్థ ప్రముఖ్‌ సర్వేచరణ్‌, కిషోర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్‌ఎస్‌ఎఫ్‌ డీఎల్‌ నరసింహరావు, హనుమంతరెడ్డి, మధుసూదన రెడ్డి, హిందూ సమ్మేళన నిర్వాహక అధ్యక్షులు నాగభూషణరెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:05 AM