Home » 2025
పట్టణంలోని కూరగాయల మా ర్కెట్ వద్ద ఉన్న సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయం ఎదుట రోడ్డుపైనే ద్విచ క్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారింది. ఆ రోడ్డు వెళ్లే వాహనదారులు, పాదాచారులు చాలా ఇబ్బందులు పడు తున్నారు. ప్రతి రోజు రిజిసే్ట్రషనల కోసం ఎంతోమంది సబ్రిజిసా్ట్రర్ కార్యాలయానికి వస్తుంటారు.
పట్ణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఎస్సీఎఫ్ క్రీడల్లో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఆల్ రౌండ్ ఛాంపియన షిప్ గెలుచుకున్నారు. రెండో స్థానంలో ఏపీ ట్రైబుల్ వెల్ఫేర్ పాఠ శాల, మూడో స్థానంలో పట్నం పాఠశాల నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.
అప్పులు చేసి, ఆరుగాలం కష్టపడి పండించిన పంట మూడురోజులు గా కురిసిన వర్షానికి పూర్తిగా తడిసి ముద్ద అయింది. వేరు శనగకాయలతో పాటు పశువుల మేత కూడా నల్లగామారి ఆ రైతును నిండాముంచింది. మండలంలోని దర్శినమల గ్రామానికి చెందిన రైతు నారాయణ, లక్ష్మీనారాయణమ్మ కుటుంబం నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని బోరుబా వి కింద వేరుశనగను పంట సాగుచేశారు.
విద్యార్థుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ఉద్యోగం సాధించాల్నదే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. గత నెల 16న సం స్కృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో నంగ్యాలలోని గురురాఘవేంద్ర బ్యాం కింగ్ కోచింగ్ సెంటర్ సహకారంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శిక్షణ అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 120 మంది విద్యార్థులు హాజరయ్యారు
గ్రామాల అభివృద్ధే ధ్యే యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ పేర్కొన్నారు. మండలంలోని మోటుమర్ల నుంచి కత్తేకొట్టాల వరకు, పోతులనాగేపల్లి మీదుగా కనంపల్లికి, ధర్మవరం రోడ్డు నుంచి చింతలపల్లి, వసంతపురం నుంచి చిగిచెర్ల క్రాస్ వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.6.10కోట్లు నిధులు మంజూరయ్యాయి.
ఇలా ఉంటే .. గ్రామంలోకి వెళ్లేది ఎలా.. బయటకు వచ్చేది ఎలాగని చిన్నరామన్నగారిపల్లి గ్రామస్థులు ప్ర శ్నిస్తున్నారు. గ్రామంలోకి వెళ్లే కూడలి వద్ద వర్షపునీరు నిలిచి దోమలకు నిలయంగా మారింది. కూడలి మొత్తం బురదమయమై గ్రామంలోకి వెళ్లడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. నీరు నిలువ ఉండటంతో దోమలు పెరిగి రోగాలబారిన పడే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెం దుతున్నారు.
మండలకేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే డబుల్ రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, గడ్డి పొద లను ఏపుగా పెరిగాయి. దీంతో వాహనదారులు చాల ఇబ్బందులు పడు తున్నారు. నల్లమాడ నుంచి నుంచి దొన్నకోట గ్రామం మీదుగా పులగం పల్లి వరకు, నల్లమాడ నుంచి రాగానిపల్లి, గోపేపల్లి మీదుగా కొండె పా ళెం వరకు ఈ పరిస్థితి కనిపిస్తోంది.
తమ గ్రామాలను మున్సిపాలిటీలోకి విలీనం చేస్తే ము న్సిపాలిటీ విఽధించే పన్నులు చెల్లించ లేమని పలు గ్రామాల ప్రజలు, టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. తా మంతా వ్యవసాయం, ఉపాధిహామీ పథకం ద్వారా జీవనం సాగిస్తున్నా మని, మున్సిపాలిటీలోకి తమ గ్రా మాల విలీనం ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు.
సత్యసాయి శతజయంతి ఉత్స వాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని కౌన్సిల్ సభ్యులు అధికారు లకు సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం చైర్మన తుంగ ఓబుళపతి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమా వేశం నిర్వహించారు
అర్హులైన భవన నిర్మాణ కార్మి కులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాల యానికి ఎదురుగా ఉన్న భవన నిర్మాణ కార్మికుల కాలనీని గురువారం ఆయన పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులలో అర్హులైన వారంద రికీ న్యాయం చేస్తామని తెలిపారు.