Home » 2025
మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు.
జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎ. శ్యాంసుందర్ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్, ఆర్డీఓ వీవీఎస్ శర్మతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు.
పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
మండల పరిధిలోని ఆకు ల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగు దే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పట్టణంలోని స్వయంభూ కాలభైరవ స్వా మి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం పూజలు ఘనంగా జరిగాయి. పూజారి ధనుంజయ ఆచారి భక్తులచే స్వామివారికి అభిషేకాలు చే యించారు. నారికేళ దీపోత్స వాన్ని నిర్వహించారు. అన్న ప్రసాద సేవ చేపట్టారు.
మండల పరిఽధిలోని ముండ్లవారి పల్లి సమీపంలో పాపాగ్ని నదికి అడ్డంగా నిర్మించిన సీజీ ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. పది రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వందమానేరు, పాపాగ్ని నది ప్రవహించ డంతో డ్యాంకు పూర్తి స్థాయిలో నీరుచేరింది. దీంతో మూడు రోజుల నుంచి ప్రతి రోజు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నా రు.
మొంథా తుఫాన కారణం గా రాబోవు నాలుగురోజులు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురి సే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దా ర్ సురేశబాబు తెలిపారు. ఆయన ఆదివారం స్థానిక తహసీల్దార్ కా ర్యాలయంలో వీఆర్ఓలతో సమావేశమయ్యారు. తుఫాన ప్రభా వం తీవ్రంగా ఉందని, మట్టిమిద్దెలలో ఎవరూ నివాసం ఉండరా దన్నారు. పరిస్థితి తీవ్రత తగ్గే వరకు ప్రభుత్వ భవనాలలో ఉండాల న్నారు.
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎస్పీ సతీష్కు మార్ ఆదేశాలతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా నేరస్థులను, రౌడీషీటర్లను పోలీసుస్టేషన్లకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ ఓ ప్రకటనలో తెలియచేస్తూ... మహిళలు, విద్యార్థినుల పట్ట అసభ్యకర ప్రవర్తనను మానుకోవాలన్నారు. లేకుంటే కఠిన చర్యలు తప్పవని హె చ్చరించారు.
నియోజకవర్గంలో చేపట్టవల సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం రాత్రి రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ...నియోజకవర్గం అభివృద్ధి ప ట్ల మన బాధ్యత అత్యంత కీలకమైందన్నారు. ప్రతివార్డు, గ్రామ ప్రజల కు అభివృద్ధి ఫలాలు చేరేలా అధికారులు ప్రణాళికా బద్ధంగా పనిచేయా లని అదేశించారు.
ఘోర బస్సు ప్రమాద ఘటన లో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద రెండురోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో పదిమందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు.