Home » 2025
స్థానిక ఎస్టీఎస్ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు.
ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్కవేటర్, ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్నారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో విద్యుత శాఖ అధికా రులు కొత్తగా విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్నా రు. గురువారం, శుక్రవారం స్థానిక గోపురం రోడ్డులో విద్యుత సిబ్బంది ఎత్తైన విద్యుత స్తంభాలను ఏర్పాట చేస్తున్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తగా ఎత్తైన స్తంభాలు మా ర్చే కార్యక్రమం చేపట్టడంతో జిల్లా కేంద్రంలో పగటిపూట విద్యుత సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు.
పట్టణం నుంచి మామిళ్లప ల్లికి వెళ్లే రహదారి గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైంది. పోతుకుంట బృందావన కాలనీ పోలీస్గెస్ట్ హౌస్ వద్ద నుంచి ధర్మవరంలోకి రహదారి అంతా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కాలంలో ఈ రహదారిపై ప్యాచ వర్కులు చేసినా నెలలు గడవకముందే రహదారి అంతా ఛిద్ర మవు తోందని ఆ రహదారి గుండా ప్రయాణించే గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.
ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగిన డివిజన స్థాయి పోటీలను రెండో రోజు గురువారం ఎంఈఓలు చెన్నకృష్ణ, ఓ బులరెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయురాలు స్వరూప అధ్యక్ష త వహించారు. అండర్-14, 17 బాలికల ఖోఖో విన్నర్స్గా గాండ ్లపెంట మండలం, రన్నర్స్గా కదిరి మండలం జట్లు నిలిచాయి. అండర్ -14, 17 బాలుర ఖోఖో విన్నర్స్గా గాండ్లపెంట మండలం జట్లు, అండర్ -14 రన్నర్గా తనకల్లు మండలం, అండర్-17 రన్నర్ గా కదిరి మండలం జట్టు నిలిచాయి.
స్థానిక మార్కెట్యార్డ్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి మార్కెట్యార్డ్ చైర్మన, డైరెక్టర్లకు సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్యార్డ్లో తొలిసారిగా నూతన కమిటీ సమావే శాన్ని చైర్మన పూలశివప్రసాద్ అఽఽధ్యక్షతన గురువారం నిర్వహించా రు. మాజీ మంత్రి పల్లె ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు.
స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం అపరిశుభ్రతకు నిలయంగా మారింది. మండల స్థాయి కార్యా లయాలన్నీ ఈ ఆవరణంలోనే ఉన్నాయి. దీంతో అన్ని శాఖల అఽధికారు లు ఇక్కడికి రోజూ వచ్చి పోతుంటారు. అదేవిధంగా ప్రతి నెలా మూడో వారం ఉద్యోగులందరూ. కార్యాలయాల పరిసరాలతో పాటు, గ్రామాలలో స్వచ్ఛాంధ్ర - స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని చేపట్టి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది.
పట్టణ సమీపంలోని పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సిపాలిటీలోకి చేర్చాలం టూ కౌన్సిలర్లు మూకమ్మడిగా అధికారులను డిమాండ్చేశారు. సమావేశం ప్రారంభకానికి ముందే సమావేశపు హాల్లో ఉన్న కమిషనర్, అధికారుల ను చైర్పర్సన కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు చైర్పర్సన చాంబర్లోకి పిలిపించు కున్నారు. పోతుల నాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి కాలనీలను మున్సి పాలిటీలోకి చేర్చేలా అజెండాలో ఎందుకు పొందుపరచలేదని ఇనచార్జ్ కమిషనర్ సాయికృష్ణను డిమాండ్చేశారు.
మండలకేంద్రంలో పాడుబడిన పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ముళ్లకంపలు, పిచ్చికంపలు పెరిగి పోవడంతో చుట్టుపక ్కల కాపురాలున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు పాములు బయటకు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఇళ్లకు వాకిళ్లు వేసుకొని, బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు.