శ్రీలంకతో టెస్ట్ సిరీస్ క్లీన్స్వీప్కు భారత్ మరింత చేరువైంది. ఫాలోఆన్లో పసిందు సూర్యబండార (92), కమిందు మెండిస్ (55) అర్ధ శతకాలతో పోరాడినా.. కీలక తరుణంలో భారత స్పిన్నర్లు చెలరేగారు.
ఆసియా జూనియర్ చెస్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్ టైటిళ్లు సొంతం చేసుకున్నారు.
క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్న క్రికెటర్లపై చర్యలు తీసుకోవడంలో ఐసీసీ, బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తప్పుపట్టాడు.
విల్ పకోవ్స్కీ ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్. 28 ఏళ్ల అతడు 2021లో సిడ్నీలో భారత్పై ఆస్ట్రేలియా తరఫున ఒకే ఒక టెస్ట్ ఆడాడు. కేవలం 27 సంవత్సరాల వయస్సులో గత ఏడాది ఏప్రిల్లో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది.
ఎలెనా స్విటోలినా, గైల్ మోన్ఫిల్స్ దంపతులు యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్లో ఈ జోడీ 5-4, 4-5, 10-8తో సినియకోవా/హెన్రీ పాటన్ జోడీపై గెలుపొందింది.
సెమీఫైనల్కు ఎలాగూ చేరలేకపోయింది. ఇప్పుడిక భారత మహిళల జట్టు ప్రపంచ కప్ హాకీలో చారిత్రక ఐదో స్థానంపై గురిపెట్టింది. ఈ క్రమంలో గురువారం జరిగే మ్యాచ్లో పటిష్టమైన జర్మనీని ఢీకొననుంది.
దులీప్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు మేనేజర్గా ఆంధ్ర మాజీ క్రికెటర్ కె.నాగ గంగాధర్, ప్రధాన కోచ్గా విక్రమ్ వర్మ నియమితులయ్యారు. గంగాధర్ స్వస్థలం పిఠాపురం కాగా, విక్రమ్ విశాఖపట్నంకు చెందిన వారు.
నార్త్జోన్ జట్టు దులీప్ ట్రోఫీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. క్వార్టర్స్లో వెస్ట్జోన్పై 52 పరుగుల తేడాతో గెలిచింది.
గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ తొలి క్లాసిక్ గేమ్లో భారత జీఎం ప్రజ్ఞానందకు షాక్ తగిలింది. అమెరికా జీఎం ఫాబినో కరువానా చేతిలో ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు.
ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్లో జస్ప్రీత్ బుమ్రా తన నెంబర్వన్ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రెండు స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.