మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు భివండిలో రోడ్లు జలమయం అవగా.. స్థానిక నివాసి షాదాబ్ 'స్పైడర్మ్యాన్' వేషధారణలో వీధుల్లోకి వచ్చి, ట్రాఫిక్ను నియంత్రిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చి నిజమైన సూపర్హీరో అనిపించుకున్నాడు..
జమ్మూ కశ్మీర్లోని గురేజ్ లోయలో ఫొటోల కోసం ఆగడంతో.. పర్యాటకుల కారు ఊహించని విధంగా లోయలో పడిపోయింది. ప్రమాదానికి కొద్దిక్షణాల ముందే ప్రయాణికులంతా కిందకు దిగడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది..
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి బైక్ కొనుగోలు చేశారు. అందుకు అవసరమైన రూ.1.10 లక్షల మొత్తాన్ని రూ.10 నాణేల రూపంలో చెల్లించారు.
మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ప్రయాణికుల రైలును నిలిపివేసి.. లోకో పైలట్ సమోసాలు కొన్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ స్పందించింది. ఈ ప్రచారాన్ని ఖండించింది.
నిత్యం సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు షేర్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల వీడియోలు ఉంటాయి. అందులో కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేనట్లుగా ఉంటాయి.
ఓ తాతయ్య నడిరోడ్డుపై వీరవిహారం చేశాడు. చేతులు వదిలేసి బైక్ నడిపాడు. అటు ఇటు వాటర్ క్యాన్లు పెట్టుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఒక జంట తమ బిడ్డను డోర్ ఫ్రేమ్కు వేలాడదీసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. తమ బిడ్డ ఎత్తు పెరిగేందుకు ఇలా చేశామన్న వారిపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్లూ నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో నడిచే లోకల్ రైల్ సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
సమోసాల కోసం ఓ లోకో పైలట్ రైలు ఆపి.. సమీపంలోని దుకాణానికి వెళ్లి సమోసా కొన్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ ఇందౌర్లోని రంగ్వాసా ప్రాంతంలో రైలును లోకో పైలట్ నిలిపివేశాడు.
సాధారణంగా జింకలు పూర్తిగా శాకాహార జంతువులు. గడ్డి, ఆకులు తప్ప మాంసాహారం జోలికి వెళ్లవు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో జింక ఒక పామును నములుతూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.