టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు, 18 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విజేత లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీలో మంగళవారంనాడు చేరారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన ఆమె ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
బీహార్లోని నలందలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నలందలో ఒక ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది.
కొత్త ఆర్థిక సంవత్సరం రేపటి నుంచి ప్రారంభం కానుంది. బ్యాంకింగ్, పన్నులు, పెట్టుబడులకు సంబంధించి పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇవి మీ నెలవారీ బడ్జెట్ నుంచి దీర్ఘకాలిక పొదుపు వరకు అన్నింటిపైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్స్పీకర్లు, అంబులెన్స్కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
లెబనాన్లో ‘బ్లూ హెల్మెట్స్’పై దాడుల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాంతి పరిరక్షకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేసింది. లెబనాన్ మిషన్లో కూడా భారత సైనికులు సేవలందిస్తున్న సంగతి తెలిసిందే.
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కేరళంకు బయలుదేరనున్నారు. అక్కడ రెండు రోజుల పాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
దేశంలో నక్సలిజం దాదాపు అంతమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సమాజంలో జరిగే అన్యాయాలకు రాజ్యాంగంలో పరిష్కార మార్గాలున్నాయని, ఆ మార్గాలను వదిలి ఆయుధాలు చేపట్టడం సరి కాదని అన్నారు.
దేశంలో మావోయిస్టులను, నక్సలైట్ ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు నేటి ...
నక్సలిజంతో తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని నక్సల్ ఉద్యమ అగ్రనాయకత్వమంతా...