భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున విదేశాంగ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా హాజరుకానున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
జైపుర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం.
గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్కు పునాది కావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
అయోధ్య విరాళాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల తరఫున ఏ న్యాయవాదీ కోర్టులో వాదించరాదని నిర్ణయించింది. బార్ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ రవాణా శాఖ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏఐఏడీఎంకేకు రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.
భారత్-సీషెల్స్ మధ్య ఉన్న చిరకాల స్నేహబంధానికి అద్దం పట్టేలా సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా సీషెల్స్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ దేశ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రధాన నిందితులుగా నిలిచారు.
అయోధ్య వివాదంలో చర్చల మార్గాన్ని సమర్థించిన మౌలనా సల్మాన్ నద్వీ కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు.
కారు రివర్స్ చేస్తుండగా.. మరో కారు దానిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.