Home » National
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకున్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వారణాసిలో ఆయన సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. అందులో తన పెట్టుబడులు, స్థిర, చరాస్తులను డిక్లేర్ చేశారు.
లోక్సభ ఎన్నికల్లో మోదీ ఇప్పటికే 270 సీట్లు గెలిచినట్టు తాను చెప్పగలనని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 400కు పైగా సీట్లలో గెలుపు సాధించడమే లక్ష్యంగా ఈ ఎన్నికల్లో తాము పోరాడుతున్నామని పశ్చిమబెంగాల్లోని బాంగావ్లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ చెప్పారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారంనాడు తనపై దాడి జరిపినట్టు అదే పార్టీకి చెప్పిన రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మలివాల్ (Swamti Maliwal) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు స్పందించింది. సీఎం వ్యక్తిగత సహాయకుడు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు అంగీకరించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ఆరేళ్ల పాటు నిషేధం విధించాలని..
రాజ్యాంగాన్ని మార్చనున్నారంటూ విపక్షాలు తనపై చేస్తున్న ఆరోపణలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తోసిపుచ్చారు. తాను రాజ్యాంగ పరిరక్షకుడనని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో మంగళవారంనాడు నామినేషన్ వేసిన అనంతరం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలపై మోదీ సమాధానమిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనుకరిస్తూ వీడియోలు చేయడంలో పేరున్న యూట్యూబర్, కమెడియన్ శ్యామ్ రంగీలాకు చేదు అనుభవం ఎదురైంది. నరేంద్ర మోదీ మంగళవారంనాడు నామినేషన్ వేసిన వారణాసి (Varanasi) నుంచి పోటీ చేసేందుకు తాను ప్రయత్నించినప్పటికీ నామినేషన్ దాఖలుకు జిల్లా యంత్రాంగం తనను అనుమతించ లేదని ఆయన ఆరోపించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి ఘటనలో ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ అంశంలో ఆయన స్పందించకపోవడం సిగ్గు చేటు అని పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు వారాణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య నేతలతో కలెక్టరేట్ కార్యాలయం వెలుపల బలప్రదర్శన చేశారు. ఎన్డీయే కూటమి నేతలు తమ సంఘీభావాన్ని చాటుతూ మోదీ నాయకత్వంలో పనిచేయడం పట్ల హర్షం ప్రకటించారు.
బస్సుల్లో.. బస్టాండుల్లో, రైళ్లలో.. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల జేబులను చోరి చేయడం సహజంగా వింటుంటాం.. చూస్తుంటాం. కానీ విమాన ప్రయాణికులనే లక్ష్యంగా చేసుకొని వారి విలువైన ఆభరణాలను చాకచక్యంగా కొట్టేస్తున్న ఓ చోర శిఖామణి ఆటను ఢిల్లీ ఎయిర్పోర్ట్ పోలీసులు కట్టించారు.
బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, రాజ్యసభ మాజీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ (72) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన చికిత్స పొందుతూ న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి 9.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర యూనిట్ సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా వెల్లడించింది.