ఏప్రిల్ 22 నుంచి కేదార్నాథ్లో పునఃదర్శనాలు
ABN , Publish Date - Feb 16 , 2026 | 04:03 AM
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయంలో ..
రుద్రప్రయాగ్, ఫిబ్రవరి 15: ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో దర్శనాలు తిరిగి ఏప్రిల్ 22న ప్రారంభం కానున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఈ తేదీని ఖరారు చేసినట్లు బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా శీతాకాలంలో సుమారు 6 నెలల పాటు మూసిఉంచే ఈ ఆలయ పునఃప్రారంభ తేదీని మహాశివరాత్రి రోజున ప్రకటించడం ఆనవాయితీ. కేదార్నాథ్ ఆలయం పునఃప్రారంభ తేదీ ప్రకటించడంతో చార్ధామ్ యాత్రకు షెడ్యూల్ ఖరారైంది. బద్రీనాథ్ ఆలయం ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ధామాలు ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి తెరుచుకోనున్నాయి.