పాక్లో యూఎస్తో చర్చల సందర్భంగా తమ అణు కార్యక్రమం ప్రస్తావనకు అంగీకరించి వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డామని ఇరాన్ పార్లమెంట్ సభ్యుడు మహమూద్ నవాబియన్ అభిప్రాయపడ్డారు.
అక్రమ మార్గాల్లో పౌరసత్వం పొందిన వారిపై కొరడా ఝళిపించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. 384 మంది పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నా హోర్ముజ్ జలసంధిపై పట్టు కోసం ఆ రెండు దేశాల నౌకాదళాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఆ మార్గంలో....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. హోర్ముజ్ జలసంధిలో మందుపాతరలను అమరస్తున్న ఇరాన్ నౌకలపై దాడులు చేయాలని ఆదేశించారు. ఆ పడవలు ఎంత చిన్నవైనా సరే, వాటిని కాల్చేసి, వాటిల్లోని సిబ్బందిని మట్టుబెట్టాలని అమెరికా నౌకా దళానికి సూచించారు.
భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది.
ఇరాన్తో శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలను త్వరగా పున:ప్రారంభించాలనే ఒత్తిడి తనపై లేదన్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం దశాబ్దాలుగా ఉంది. అమెరికా సహాయంతో ఇరాన్పై దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎప్పట్నుంచో ప్లాన్ చేస్తున్నారని అగ్రరాజ్య విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జాన్ కెర్రీ వెల్లడించారు.
పుట్టుకతో పౌరసత్వం అందించే విధానానికి ముగింపు పలకాలంటూ ఒక రేడియో వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీపోస్టు చేశారు. చైనా, భారత్లు నరకప్రాయం అంటూ ఆ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం విమర్శలకు దారితీస్తున్నాయి.
హోర్ముజ్ జలసంధిలో సీమైన్స్ను తొలగించేందుకు ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అమెరికా రక్షణ శాఖ అంచనా వేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పాకిస్థాన్ పర్యటనపై వైట్ హౌస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక ప్రకారం జరగాల్సిన పర్యటన వాయిదా పడిందని అధికారికంగా ప్రకటించింది. చర్చలకు సంబంధించి ఇరాన్ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.