దేశీయంగా మిలట్రీ-గ్రేడ్ డ్రోన్ల ఉత్పత్తికి అమెరికా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారులు డ్రోన్ల తయారీ వ్యాపారంలో పెట్టుబడులు పెడుతున్నారు.
ఫ్లోరిడాలో రిపబ్లికన్ మెంబర్స్ ఇష్యూస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ మాట్లాడుతూ, మూడున్నర రోజుల్లో ఇరాన్ నావికాదళానికి చెందిన 46 నౌకలను అమెరికా మిలటరీ సముద్ర గర్భంలో ముంచేసిందని, అవన్నీ సముద్రం అడుగున పడి ఉన్నాయని తెలిపారు.
ప్రపంచ దేశాలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్న ఇరాన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, చమురు ధరలు కిందకు దిగి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ విషయంలో తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడానికి చేరువలో ఉన్నామన్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్ యుద్ధం, చమురు సరఫరాలో అంతరాయం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మొదలైన విషయాలపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగాయి.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో తొలగిపోయేలా కనిపించడం లేదు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. ఇజ్రాయెల్పై, గల్ఫ్లోని చమురు రిఫైనరీలు.....
బ్యారెల్ ముడి చమురు ధర 200 డాలర్లకు చేరితే తట్టుకునే ధైర్యం ఉంటే యుద్ధాన్ని కొనసాగించాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రతినిధి అమెరికాకు సవాలు విసిరారు.
ఇరాన్లోని పాఠశాలపై దాడికి ట్రంప్ ప్రభుత్వం కారణమంటూ అక్కడి పత్రిక టెహ్రాన్ టైమ్స్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. దాడిలో మరణించిన చిన్నారుల ఫొటోలను కూడా ప్రచురించింది.
ఇరాన్ కొత్త సుప్రీం నేత మజ్తాబా ఖమేనీకి రష్యా అభినందనలు చెప్పగా, కొత్త సుప్రీంను మట్టుబెడతామంటూ ఇజ్రాయెల్ మిలటరీ చేస్తున్న హెచ్చరికలతో చైనా విభేదించింది.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతంలో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఒక భారతీయుడు మృతి చెందినట్టు వచ్చిన వార్తలను రియాద్లోని భారత రాయబార కార్యాలయం సోమవారంనాడు తోసిపుచ్చింది. అల్ ఖర్జ్ వద్ద జరిగిన దాడి ఘటనలో భారత్కు చెందిన వ్యక్తి ఎవరూ చనిపోలేదని వెల్లడించింది.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు భారత్కు అనుమతి ఇస్తున్నట్టుగా అమెరికా ఇటీవల ప్రకటించింది. దీనిపై అమెరికా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందని పలువురు విశ్లేషకులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా భారతీయ అమెరికన్లు ఎందుకు నోరు మెదపట్లేదని నిలదీస్తున్నారు.