పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత ఎక్కువ అవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో గల్ఫ్ ప్రాంతం రావణ కాష్ఠాన్ని తలపిస్తోంది
ఇరాన్ సుప్రీం కమాండర్ అలీ ఖమేనీని హత్య చేసి సంబరపడ్డ ట్రంప్ సర్కార్కు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ప్రకటన విడుదల చేశారు. హోర్ముజ్ జలసంధిని మూసే ఉంచుతామని అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు.
ఇరాన్పై యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో లక్ష్యంగా చేసుకోవడానికి ఇక ఏమీ మిగల్లేదని చెప్పారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్లాండ్ కార్గో షిప్పై క్షిపణి దాడి జరిగింది. ఒమన్ తీర ప్రాంతం సమీపంలో కార్గో షిప్ మయూరీ నారీని ఇరాన్ ప్రాజెక్టైల్ ఢీకొన్నట్టు థాయ్ అధికారులు తెలిపారు.
గల్ఫ్ ప్రాంతాల్లో భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా- ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా.. ఇరాన్ పశ్చిమాసియా దేశాలపై విరుచుకుపడుతుంది. ఈ క్రమంలోనే ఐటీ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.
ఇరాన్ కొత్త సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల్లో గాయపడినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కుమారుడు యూసఫ్ పెజిష్కియాన్ బుధవారంనాడు ఒక ప్రకటనలో ఖండించారు. మొజ్తాబా ఆరోగ్యంతో, సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో తాను చర్చలు జరిగే అవకాశం ఉండొచ్చని అన్నారు. అయితే పరిస్థితులను బట్టి అది ఉంటుందన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరాన్ విదేశీ వ్యవహారాల వ్యూహాత్మక మండలి సలహాదారు కమల్ ఖారాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. దౌత్య భాష అమెరికాకు తెలియదని, ఆ దేశంతో సుదీర్ఘ యుద్ధానికి ఇరాన్ ఆర్మీ సిద్ధంగా ఉందని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.