పశ్చిమాసియాలో ఘర్షణలను తగ్గించేందుకు ఇరాన్ కొత్తగా మూడు దశల శాంతి చర్చల ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో, ఈ ప్రతిపాదన ఆసక్తికరంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్ల విందులో కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లో శ్వేతసౌధం సమీపంలోని హిల్టన్ హోటల్లో ఏటా ఈ విందు ఏర్పాటు చేస్తారు.
ఎఫ్బీఐ చీఫ్ క్యాష్ పటేల్కు పదవీ గండం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆయనపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులకు తెగబడ్డ నిందితుడిని 31 ఏళ్ల కోల్ టొమాస్ అలెన్గా పోలీసులు గుర్తించారు. అతడు కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్, మెకానికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్తో కొనసాగుతున్న శాంతి చర్చల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను పంపిందని, దానిని తాము తిరస్కరించామని ట్రంప్ తెలిపారు.
అమెరికా- ఇరాన్ మధ్య రెండోదఫా చర్చలపై పీటముడి వీడటం లేదు. ఆదివారం చర్చలు ఉంటాయని అంతా భావిస్తున్న సమయంలో ...
అణ్వాయుధాలను అభివృద్ధి చేయాలనే ఆశలను పూర్తిగా వదులుకునేవరకు ఇరాన్ పోర్ట్లపై, నౌకలపై దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తేల్చి చెప్పారు. ఈ దిగ్బంధనాన్ని ఇనుప కవచంగా పేర్కొన్న హెగ్సెత్, ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని తెలిపారు.
ఇరాన్, రష్యా చమురు కొనుగోళ్లపై గతంలో ఇచ్చిన సడలింపులను ఇకపై కొనసాగించబోమని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ తాజాగా స్పష్టం చేశారు.
గల్ఫ్లో ఉద్రిక్తతలకు చెక్ పెట్టేలా నేడు పాక్లో మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల కోసం ఇప్పటికే ఇరాన్ బృందం ఇస్లామాబాద్కు చేరుకుంది. అయితే, యూఎస్తో నేరుగా చర్చించేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇప్పటివరకూ కేవలం ఒక్కరికే గోల్డ్ కార్డును మంజూరు చేశామని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హొవార్డ్ లుట్నిక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, వందల సంఖ్యలో దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అమెరికాలో శాశ్వత నివాసార్హత కల్పించే గోల్డ్ కార్డు స్కీమ్ను అధ్యక్షుడు ట్రంప్ గతేడాది డిసెంబర్లో ప్రారంభించారు.