హోర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ఆర్మీకి చెందిన హెలికాఫ్టర్ను ఇరాన్ కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అమెరికా, ఇరాన్పై ప్రతీకార దాడులు మొదలెట్టింది.
యూఎస్ ఆర్మీకి చెందిన ఒక అపాచీ హెలికాప్టర్ హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఇటీవల కూలిపోయింది. పైలట్లు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
ఇరాన్పై దాడులను కట్టిపెట్టకపోతే ఒంటరైపోతావని తాను ఇజ్రాయెల్ ప్రధానిని హెచ్చరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మీడియాకు తెలిపారు.
ఇరాన్ దాడులతో నష్టపోయిన గల్ఫ్ మిత్రదేశాలకు సహాయం చేసేందుకు అమెరికా ప్రణాళికలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ భార్య, మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ బహూకరించిన 7.5 క్యారెట్ల వజ్రాన్ని తాను ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా నిబంధనల కారణంగా అది సాధ్యపడలేదని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తమ సుప్రీం లీడర్ మొజ్తాబా సమావేశమయ్యే అవకాశం ప్రస్తుతానికైతే లేదని ఇరాన్ నేత, మొజ్తాబా ప్రతినిధి మోహిసీన్ రెజాయ్ తెలిపారు.
బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద జాబితాలోకి చేర్చాలన్న పాక్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. పాక్ ప్రతిపాదనను అమెరికా తోసిపుచ్చింది. ఈ విషయంలో భారత్ అభిప్రాయంతో యూఎస్ ఏకీభవించింది.
భారత్, అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ కాల్ సందర్భంగా కాస్త ఆందోళన చెంది, మాట తూలానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. అయితే, నెతన్యాహు తనకు మంచి మిత్రుడని కూడా అన్నారు.
కొన్ని దేశాల ఉత్పత్తులపై మరోసారి 12.5 సుంకం విధించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై భారత్ స్పందించింది. అమెరికాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పింది. ప్రతిపాదిత సుంకాల పరిధిలోకి కొన్ని వస్తువులు రావని కూడా చెప్పింది.