అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ న్యూయార్క్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. నగరంలోని బ్రూక్లిన్లో ఉన్న కోనీ ఐలాండ్ ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.
అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చి 250 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకంతో కూడిన డాలర్ నోట్లను ప్రవేశపెడుతున్నట్లు యూఎస్ ట్రెజరీ విభాగం ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల మధ్య అభిప్రాయభేదాలున్నట్టు పలు అంతర్జాతీయ మీడియాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు త్వరలోనే ప్రత్యక్షంగా సమావేశమయ్యే అవకాశముంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ను నామినేట్ చేస్తున్నానంటూ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో హంటర్ బైడెన్ పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. 16 మంది చిన్నారులను ఏళ్ల తరబడి ఓ పాడుబడిన ఇంట్లో బంధించి ఉంచిన విషయం తాజాగా బయటపడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదాయం గతేడాది విపరీతంగా పెరిగింది. 2025లో తన క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా ట్రంప్ సుమారు 1.2 బిలియన్ డాలర్ల (రూ.11 వేల కోట్లకు పైగా) ఆదాయం పొందినట్లు తాజాగా విడుదలైన ఆర్థిక వివరాలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో ఇటీవల మళ్లీ చెలరేగిన ఉద్రిక్తతలకు తాత్కాలికంగా విరామం లభించనుంది. అమెరికా, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. చర్చలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో పరస్పర దాడులను నిలిపివేయాలని ఒక ఒప్పందానికి వచ్చాయి.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ అమెరికా మరోసారి వైమానిక దాడులకు దిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో వెల్లడించారు.
ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరినంత మాత్రాన ముప్పు పూర్తిగా తొలగిపోయినట్టు కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో మళ్లీ ఘర్షణ మొదలైన నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.