ఇజ్రాయెల్ తొలి దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లి అలీ ఖమేనీ మృతి తీవ్ర సంచలనమైంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ కొడుకుల్లో ఒకరు మృతి చెందినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన కుమారులు నలుగురు క్షేమంగా ఉన్నారు.
గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలపై క్షిపణులు, డ్రోన్ దాడులు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. అయితే ఆయా దేశాలు తమ భూభాగాల నుంచి ఇరాన్పై దాడిని ప్రారంభించకుంటే తాము కూడా దాడి చేయమని అన్నారు.
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తరువాత ఇతర మిత్రదేశాలతో కలిసి ఇరాన్ను ఆర్థికంగా ఉన్నత స్థితికి చేర్చేందుకు నిరంతరం శ్రమిస్తామని చెప్పారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని ఇజ్రాయెల్ బ్లూ స్పారో క్షిపణితో టార్గెట్ చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతరిక్ష నుంచి విరుచుకుపడే క్షిపణిగా బ్లూ స్పారోను ఇజ్రాయెల్ వర్గాలు పిలుస్తాయట.
పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇరాన్పై నాలుగు వారాల్లో సైనిక చర్య ముగుస్తుందని అమెరికా తొలుత పేర్కొన్నా..
ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని నిలిపివేయాలంటూ కొందరు సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా సెనేట్ (ఎగువసభ) గురువారం తిరస్కరించింది.
ఇరాన్లో ప్రభుత్వ మార్పు, కొత్త నేత ఎన్నికలో తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు....
ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో అణు బాంబులను తీసుకెళ్లగలిగే ఖండాంతర క్షిపణిని అమెరికా విజయవంతంగా పరీక్షించింది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా భారీ అణు సామర్థ్యం గల క్షిపణి పరీక్ష నిర్వహించడం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికా సైన్యం కాలిఫోర్నియా తీరంలో ఉన్న వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి శక్తిమంతమైన మినిట్మ్యాన్-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన యుద్ధ చర్యలపై అమెరికా కాంగ్రెస్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ట్రంప్ చేపట్టిన సైనిక చర్యలను డెమోక్రాట్లు నియంత్రించే ప్రయత్నాలు విఫలమయ్యాయి.