గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఒక ఇరాన్ నౌకను యూఎస్ తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ యూఎస్ దళాలపై డ్రోన్స్ను ప్రయోగించినట్టుగా కూడా మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
యూఎస్తో శాంతి చర్చల్లో ఇరాన్ పాల్గొనదని అక్కడి ప్రభుత్వ మీడియా తాజాగా పేర్కొంది. యూఎస్ వైఖరే ఇందుకు కారణమని నిందించింది.
తాము ప్రతిపాదించిన డీల్కు ఇరాన్కు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తామని ట్రంప్ మరోసారి ఇరాన్ను హెచ్చరించారు. రేపు ఇరాన్, యూఎస్ల మధ్య మరోసారి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆయన నెట్టింట ఈ మేరకు పోస్టు పెట్టారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి మునీర్ ఆసక్తి చూపుతున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మునీర్కు పెరుగుతున్న సన్నిహిత సంబంధాలు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఆందోళనలకు కారణమవుతున్నాయట.
అమెరికా-ఇరాన్ మధ్య మరో రెండ్రోజుల్లో శాంతి చర్చలు జరగనున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇరాన్ నౌకదళంపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది.
దిగ్బంధనం మొదలైన నాటి నుంచీ ఇప్పటివరకూ 21 నౌకలను ఇరాన్కు తిప్పి పంపించామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా తెలిపింది.
రష్యా చమురు కొనుగోళ్లపై ఇచ్చిన సడలింపులను మరో నెల రోజుల పాటు కొనసాగిస్తూ యూఎస్ ట్రెజరీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
తమపై అమెరికా దిగ్బంధనం ఇంకా కొనసాగుతున్న తరుణంలో హోర్ముజ్ కూడా ఎక్కువ కాలం తెరిచి ఉండకపోవచ్చని ఇరాన్ హెచ్చరించింది. చర్చలకు సంబంధించి యూఎస్ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను సహించబోమని స్పష్టం చేసింది.
శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమమధ్య శాంతి...
శుద్ధి చేసిన యూరేనియంను అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తోసిపుచ్చింది. గాల్లో మేడలు కడుతున్నారని ఎద్దేవా చేసింది.