గురువారం అబుదాబిపై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించింది. అబుదాబి ఆ మిస్సైల్ను గాల్లోనే పేల్చేసింది. అయితే, మిస్సైల్ తాలూకా శకలాలు మీద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
పశ్చిమాసియాలో చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. హోర్ముజ్ను ఇరాన్ మూసివేయడంతో పలు దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకున్నాయి. అయితే ఈ జలసంధిని భారత్ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరుస్తున్నట్టు తాజాగా ఇరాన్ ప్రకటించింది.
పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై ప్రపంచ దేశాలు ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన యుద్ధ నౌక 'అబ్రహం లింకన్'పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఇరాన్ మీడియాలో వైరల్ అవుతోంది.
పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైనా తమ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలని ఇరాన్ షరతులు విధించింది.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయంగా కాస్త ఉపశమనం నెలకొంది. పలు దేశాలు స్టాక్ మార్కెట్లు, బంగారం ధరలు, చమురు ధరలు కోలుకున్నాయి.
ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేయడంతో ప్రపంచ దేశాలు కాస్త ఉపశమనం పొందాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ కథనం సంచలనంగా మారింది.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య శాంతిస్థాపన దిశగా తదుపరి దశ చర్చలకు ఇస్లామాబాద్ను వేదికగా ఎంచుకోవాలని పాక్ సూచించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
హోర్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించే ఒక్కో సరకు రవాణా నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18 కోట్లు) చొప్పున వసూలు చేసేందుకు ఇరాన్ సిద్ధమవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై ఇరాన్ స్పందించింది.
ఇరాన్ తాజాగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పలు ప్రాంతాలపై క్షిపణులతో దాడు చేసింది. యుద్ధం ముగించాలని కోరుతూ స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఇరు పక్షాలకు సూచించారు.