అవసరమైతే ఇరాన్పై మళ్లీ దాడులు చేసేందుకు తాము సిద్ధమేనని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ గురువారం చెప్పారు. గతంలో కంటే మరింత శక్తిమంతమైన దాడులు చేస్తామని అన్నారు.
తూర్పు చైనాలోని ఒక ప్రముఖ షూ తయారీ కర్మాగారంలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది కార్మికులు సజీవదహనమయ్యారు.
భారత్, ఆస్ట్రేలియా మధ్య దృఢమైన దౌత్యబంధం ఉందని ప్రధాని మోదీ కామెంట్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఇవాళ ఆయన స్వస్థలమైన మష్హద్లో ముగిశాయి. ఇరాన్, ఇరాక్ దేశాల్లో గత ఆరు రోజులుగా సాగుతున్న సుదీర్ఘ అంతిమయాత్ర ఈ సాయంత్రం జరిగిన ఖననంతో ముగిసింది.
చైనాలో మైసాక్ తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి పాముల పెంపక కేంద్రాలు దెబ్బతినడంతో 900కు పైగా సర్పాలు బయటకు వచ్చాయి. అవి వరద నీటిలో జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి. పాక్ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు మండిపడుతున్నారు. తమ డిమాండ్స్కు పాక్ పాలకులు 48 గంటల్లోపు అంగీకరించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
చైనాలో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసాక్ తుఫాను ధాటికి ఇప్పటికే దక్షిణ చైనా అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 39 మంది మృతిచెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు చైనాకు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ వేదికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పెద్ద యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని, తన హయాంలో మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ ఆయన మళ్లీ పాత వాదనను తెరపైకి తెచ్చారు.
అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. వీసా మోసాలకు పాల్పడిన వారిపై కార్మిక శాఖ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొందరికి నోటీసులు కూడా పంపించిందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెల్లడించారు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.