నిత్యం వివాదాస్పద ప్రకటనలతో మీడియాలో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఏసు ప్రభువు అవతారవెత్తారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్కు మరో కఠిన హెచ్చరిక జారీ చేశారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి హోర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైందని తెలిపారు.
హోర్ముజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు ప్రస్తుతం నౌకా రవాణాకు అంతరాయం కలిగిస్తున్నప్పటికీ, భారత నౌకలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు.
ఇస్లామాబాద్లో అమెరికాతో జరిగిన శాంతి చర్చలు విఫలమైనప్పటికీ, తమ డిమాండ్లను అంగీకరిస్తే మరోసారి చర్చలకు సిద్ధమేనని భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ యుద్ధం కీలక దశలోకి చేరిన సమయంలో అగ్రరాజ్యానికి నాటో మిత్ర దేశాలు షాక్ ఇచ్చాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన హార్ముజ్ దిగ్బంధనానికి నాటో మిత్రదేశాలు మద్దతు ఇవ్వడానికి నిరాకరించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరో కీలక మలుపు తిరిగాయి. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ జోలికొస్తే పర్షియన్ గల్ఫ్ రేవులను దిగ్బంధిస్తామని హెచ్చరించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోర్ముజ్ దిగ్బంధన హెచ్చరికలతో అంతర్జాతీయంగా కలకలం రేగుతోంది. దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకం కలగకుండా అడ్డంకులు లేని మార్గాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చింది.
ఎంతో శక్తివంతమైన, అధునాతనమైన అమెరికా యుద్ధ విమానాలకు పశ్చిమాసియాలో గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎంతో గొప్పవి అని అమెరికా చెప్పుకుంటున్న యుద్ధ విమానాలు కూడా కూలిపోయాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా వైమానికి దళానికి భారీ నష్టం సంభవించింది.
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కాల్ తరువాత చర్చల్లో పీటముడి పడిందంటూ ఇరాన్ వార్తా సంస్థ ఒకటి ప్రచురించిన కథనం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది.