Home » International
క్రిస్టోఫర్ జార్జ్ అనే వ్యక్తి తన కుమారుడు అయిన కోరెను టార్చర్ చేశాడు. ఆ చిన్నారికి ఒంట్లో కొవ్వు ఉందని థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు. పాపం ఆరేళ్ల బాలుడు బాలుడు ఇబ్బంది పడ్డాడు. అయినప్పటికీ వదల్లేదు. తల పైన కొరికి మరి థ్రెడ్ మిల్ మీద పరుగు తీయించాడు.
ధరల పెరుగులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్పై రూ.5, హై-స్పీడ్ డీజిల్పై రూ.9 చొప్పున.. ధరలు తగ్గాయి. అంతర్జాతీయ ధరలు, దిగుమతి ప్రీమియంల తగ్గుదల కారణంగా..
ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ మూవీ సిరీస్ ‘హ్యారీపోటర్’లోని అందమైన కోట గుర్తుందా? అదేనండి.. మ్యాజికల్ స్కూల్! అచ్చం అలాంటి భవనమే ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడిది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ధ్వంసమైంది.
SIM Cards Block in Pakistan: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 లక్షల సిమ్ కార్డ్స్ బ్లాక్(SIM Cards Block) చేశారు. ఎందుకు బ్లాక్ చేశారంటే.. ఆదాయం(Income) పెంచుకోవడానికట! అవును, ఈ షాకింగ్ నిర్ణయం దేశ ప్రభుత్వం తీసుకుంది. మరి ఏ దేశ ప్రభుత్వం.. ఎందుకు సిమ్ కార్డ్స్ బ్లాక్ చేసిందో తెలియాలంటే పూర్తి కథనం తెలుసుకోవాల్సిందే. పీకల్లోతు ఆర్థిక కష్టాలతో ఉన్న..
గత కొన్ని రోజులుగా దక్షిణ చైనా(south China)లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్(Guangdong province)లోని మీజౌ నగరంలో హైవేలోని ఒక భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత చెందగా, అనేక మంది గాయపడ్డారు.
ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా బడ్జెట్ ఎయిర్లైన్స్ బోంజా అకస్మాత్తుగా మంగళవారం ఫ్లైట్లను రద్దు చేయడంతో వేల మంది ప్రయాణికులు ఇక్కట్లపాలయ్యారు.
భారతదేశంపై ఎప్పుడూ విషం చిమ్మే పాకిస్తాన్ స్వరంలో ఇప్పుడు మార్పు వచ్చింది. ముఖ్యంగా.. జీ20 సమ్మిట్కి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు చంద్రయాన్-3 ప్రాజెక్ట్తో చంద్రుడిని చేరిన తర్వాత ఆ దాయాది దేశం భారత్పై...
ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది.
ప్రపంచవ్యాప్తంగా(world wide) ఆహారం సంక్షోభం(Food Crises) గురించి ఇటివల వచ్చిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో 2023లో 59 దేశాల్లో దాదాపు 282 మిలియన్ల మంది ప్రజలు(282 million people) తీవ్రమైన ఆకలిని ఎదుర్కొన్నారని సర్వే తెలిపింది. ఈ సంఖ్య 2022 కంటే 2.4 కోట్లు ఎక్కువ ఉండటం విశేషం.
అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.