పొరుగు దేశమైన కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా కలపాలనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఆ విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా చెబుతున్నారు. అందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెబుతూ వస్తున్నారు.
పనామా కాలువ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పసిఫిక్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న 'బ్రిడ్జ్ ఆఫ్ ది అమెరికాస్' సమీపంలో ఇంధన ట్యాంకర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక ఫ్యూయల్ ట్యాంకర్లో మొదలైన మంటలు ఒక్కసారిగా భారీ పేలుడుకు దారితీశాయి.
పశ్చిమాసియాలోని యుద్ధం నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది.
ఎన్ని డెడ్లైన్లు విధించినా ఇరాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోకపోవటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇరాన్తో 37 రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ఇప్పటివరకూ దాదాపు 40 యుద్ధ విమానాలను కోల్పోయింది. గత 20 ఏళ్లలో శత్రుదేశం దాడిలో అమెరికా ఈ స్థాయిలో...
కాల్పుల విరమణకు ఇరాన్ నో చెప్పింది. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఓ కథనంలో తెలిపింది. శాశ్వత పరిష్కారం వైపే ఇరాన్ మొగ్గు చూపుతున్నట్టు పేర్కొంది.
మరికొన్ని గంటల్లో ఆర్టెమిస్-2 మిషన్ సరికొత్త రికార్డును నెలకొల్పనుంది. భూమ్మీద నుంచి గరిష్ఠ దూరానికి చేరుకున్న మానవసహిత యాత్రగా రికార్డు నెలకొల్పనుంది.
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ కోసం మధ్యవర్తులు చేసిన ప్రతిపాదనలను అమెరికా, ఇరాన్లు పరిశీలిస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, డెడ్లైన్ల ఒత్తిడిలో డీల్ సాధ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ట్రంప్ బెదిరింపుల వేళ ఇరాన్కు మరో గట్టిదెబ్బ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖాదేమీ మరణించారు.
ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందు, ఇరాన్ - అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.