జేఎన్టీయూలో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచే అంశం వైస్చాన్స్లర్ కిషన్కుమార్ రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందా అంటే.. విద్యార్థి సంఘాల నుంచి అవుననే జవాబు వినిపిస్తోంది. 213 సీట్ల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీచేయగా, విద్యార్థి సంఘాల వినతి మేరకు సీట్ల పెంపు ప్రతిపాదనపై వైస్చాన్స్లర్ సమాలోచనలు చేశారు.
JEE మెయిన్ 2026 షెడ్యూల్ విడుదలైంది. రిజిస్ట్రేషన్ వ్యవధిలో, అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను పూరించాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి, పరీక్ష రుసుము చెల్లించాలి. పరీక్ష రాయదల్చుకున్న నగరాలను ఎంచుకోవాలి.
ఎట్టకేలకు జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు.
జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న మూడు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాల్స్తో పాటు పలువురు ఆచార్యులను బదిలీ చేస్తూ వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం
హైస్కూల్ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు విద్యా శాఖ నడుం బిగించింది. అందుకోసం నిత్యం వివిధ కార్యక్రమాలు రూపొందిస్తోంది. తాజాగా 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది.
పాఠశాలల్లో విద్యార్థులు రాసే పరీక్ష పత్రాలను ఇక మీదట ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సహకారంతో దిద్దే సాఫ్ట్వేర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఆ సాఫ్ట్వేర్కు ఇండియన్ బిజినెస్ హెడ్గా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లికి చెందిన ఎం.స్నేహిత్ కొనసాగుతున్నారు.
పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఈసెట్)లో అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ) కష్టాలు వెంటాడుతున్నాయి.
విద్యార్థులను జేఎన్టీయూ నిలువునా దోచుకుంటోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్కింగ్ ప్రొఫెషనల్స్కు యూజీ, పీజీ అడ్మిషన్ల నోటిఫికేషన్లను, ప్రాజెక్టుల సమర్పణకు పర్మిషన్లు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్న జేఎన్టీయూ పరిపాలన విభాగం.. వన్టైమ్ చాన్స్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులను పూర్తి చేసిన పీజీ అభ్యర్థులపై పెనాల్టీలను బాదుతోందని ఆరోపిస్తున్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో అకడమిక్, రీసెర్చ్ కెరీర్ ఆశించే పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఈసారి 8 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకుంటారని ఎన్టీఏ అంచనా వేస్తోంది. అభ్యర్థులు కచ్చితమైన విద్యార్హతల వివరాలు సమర్పించాలని, ఎలాంటి పొరపాట్లు జరిగినా దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.
ఉన్నత చదువులు కోరుకునే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం వివిధ యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తేవడంలో జేఎన్టీయూ నిర్లక్ష్యం వహిస్తోంది.