హైదరాబాద్లో సీనియర్ లివింగ్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తున్నట్లు వెరా విటా లివింగ్ ప్రకటించింది. అమయా పేరుతో హైదరాబాద్ సమీపంలోని కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద 13 ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్లతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రోజంతా స్వల్ప నష్టాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (సీఏఎస్)లో ఒక్కసారిగా కుదేలయ్యాయి. గురువారం సెన్సెక్స్ ఏకంగా 539.35 పాయింట్లు పతనమై 76,933.59 వద్దకు జారుకుంది.
ప్రధాన మంత్రి జన్ ధన్ పథకం (పీఎంజేడీవై) పుష్కర కాలం పూర్తి చేసుకుంది. ఈ పన్నెండేళ్లలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 59 కోట్లు దాటగా.. ఆ అకౌంట్లలో ఇప్పటి వరకు రూ.3.17 లక్షల కోట్లు జమైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది.
హైదరాబాద్కు చెందిన కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవల్పమెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ (సీఆర్డీఎంఓ) ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ కూడా పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది.
మెమరీ చిప్ రేట్లు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగి డిమాండ్లో కోతపడింది. కానీ ఐఫోన్ మాత్రం తగ్గేదేలేదన్నట్టు దూసుకుపోతంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్గా ఐఫోన్ 17 నిలిచింది.
ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఇక అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ల్లో ప్రస్తుత వర్షాకాల సీజన్లో పెరుగుతున్న వ్యాధులను దృష్టిలో ఉంచుకుని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్.. వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్స్, హోమ్ హెల్త్కేర్ సపోర్ట్ను అందిస్తున్నట్టు పేర్కొంది.
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత శరవేగ వృద్ధిపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ భయాందోళనలను వ్యక్తం చేశారు. ఏఐతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు శాశ్వతంగా కనుమరుగు కావచ్చని ఆయన హెచ్చరించారు.
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. పెట్ ఫుడ్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. స్నగిల్స్ పేరుతో ప్రీమియం న్యూట్రిషన్ బ్రాండ్ను కంపెనీ విడుదల చేసింది.