ఎండననక వాననకం ఆరుగాలం కష్టించి పండించిన రొయ్య పంట రైతుకు అక్కరకు రాకుండా పోతోంది. పగలనక, రాత్రినక రొయ్యల చెరువుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడు కుంటున్న రొయ్య కళ్ల ఎదుటే నీరసించి చనిపోతుంటే రొయ్య రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు.
మా ర్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నా యి. గత వారంతో పోల్చుకుంటే కిలోకి రూ. 10నుంచి 20 పెరిగాయి.
పాలకొల్లు నియోజకవర్గంలో రూ 5.61 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌక ర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామ నారా యణరెడ్డి తెలిపారు.
‘మేం రాసిన పరీక్షల్లో ఆశించిన మార్కులు రాలేదు. కాబట్టి మా పేపర్ను మళ్లీ పరిశీలించండి’ అంటూ పదో తరగతి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు.
జిల్లా శనివారం భానుడి భగభగలతో అల్లాడింది. ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగు తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
రాజధాని అమరావతిలో శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు విడుదల చేసిన ఇరిగేషన్ కేలండర్లో చింతలపూడి ఎత్తిపోతల ఫేజ్–1ను 2027 జూన్, జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆయకట్టు రైతులు, కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశంలో తీసుకున్న పలు తీర్మానాలు ఆచరణలో బుట్టదాఖల వుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, ఇతర అధికారులు సమీక్షించి కీలక నిర్ణయాలు తీసుకుని ఆపై అమలు చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పది శాతం నూకతో మరింత నాణ్యమైన రేషన్ బియ్యం పంపిణీ చేయా లనే నిర్ణయం మిల్లర్లకు ఇబ్బందులు తెస్తోంది. బి య్యం సేకరణలో జాప్యం కారణంగా మిల్లర్లు ధాన్యం నిల్వ చేసేందుకు అవస్థలు పడుతున్నారు.
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించనున్నారు.