పెట్రోల్, డీజిల్ ప్రధాన ఇంధన వనరులు.. వీటి వాడకం తగ్గించాలంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమైనప్పటికి చాలా మందిని ఆలోచింపచేస్తోంది.
జాతీయ రహదారి పనుల్లో నిర్లక్ష్యంతో వాహదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
పట్టాలు ఇచ్చిన సీలింగ్ భూముల పట్టాదారులకు భూములు చూపించాలని చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈపీఎఫ్ కనీస పెన్షన్ను రూ.7500కు పెంచి, ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యం (డీఏ) లింక్ చేయడంతో పాటు కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్టీయూ అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఆసు పత్రి ప్రసూతి విభాగంలో వైద్య సేవలు అందు తున్నాయా ? అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్య నారాయణరాజు ఆరా తీశారు.
నూజివీడు పురపాలక సంఘంగా ఏర్పడి 43 ఏళ్లు గడిచింది. అయినా ప్రధాన వీధుల్లో ఎలాంటి మార్పు లేదు. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం పెరిగిన ట్రాఫిక్తో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. రెండుసార్లు ప్రధాన వీధుల విస్తరణకు గత పాలకులు ప్రయత్నించినా ఓట్లు రాజకీయంతో విస్తరణ సాధ్యపడలేదు.
ముదినే పల్లిలోని ప్రభుత్వ ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్కు కొందరు ఉద్యో గుల మధ్య ఏర్పడిన విభేదాలు తారస్థాయికి చేరడం, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాంతిశ్రీ ఆత్మహత్యాయత్నం వైద్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో పూర్తిస్థాయి విచారణ నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు.
దాళ్వా సాగులో రైతన్నలకు లాభాల పంట పండింది. పెట్టుబడి తక్కువతో అధిక దిగుబడులు సాధించారు. ధాన్యం విక్రయ సమయంలో రైతన్నల కళ్ళల్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.
ఉన్నత విద్య పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులపై ఫీజల కత్తి వేలాడుతోంది.
జిల్లాలో ఆదివారం సా యంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు లు చోటు చేసుకుని పలు మండలాల్లో వర్షం దంచి కొట్టింది.