రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి సూచించారు. గురువారం సూరంపేటలో పొలం గట్లుపై మొక్కలు నాటారు. పండ్ల, వాణిజ్య మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు.
ప్రాథమిక దశలోనే గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాల స్థాయిని పెంచాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్స్వప్నిల్ జగన్నాథ్ ఆదేశించారు. గురువారం జల్లార గ్రామంలోని జీపీ పాఠశాలను పరిశీలించారు. తొలుత గిరిజన విద్యార్థులతో మాట్లాడి.. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో అడిగి తెలుసు కున్నారు.
పెదపెంకిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆదేశించారు. గురువారం గ్రామంలో కొనసాగుతున్న వివిధ పనులను పరిశీలించారు.
జిల్లాలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగానే ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమం ప్రారంభిం చామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం చినమేరంగిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
దోమల నిర్మూలనతోనే వ్యాధుల నియంత్రణ సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి పి.విజయలక్ష్మీ తెలిపారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా గురువారం వైద్య సిబ్బందితో కలిసి పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జిల్లా కేంద్రాసుపత్రి వరకు అవగాహనా ర్యాలీ నిర్వహించారు.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, గురు కులాలు, ఏకలవ్య పాఠశాలలకు పంపిణీ చేయనున్న ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడొద్దని ఐటీడీఏ ఇన్చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అన్నారు.
గ్రామాల్లో నిరుపేదల గుర్తింపే పార దర్శకంగా చేపట్టాలని డీఆర్డీఏ పీడీ సిహెచ్.ప్రభావతి అన్నారు.
కొండపాలెం (గరివిడి) మేజరు పంచాయతీ పారిశుధ్య కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నుంచి మెరుపు సమ్మెకు దిగారు.
Local Poll Buzz in the Agency Area స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అక్టోబరులోగా ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది.
తమ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రాసుపత్రి వద్ద జూనియర్ వైద్యులు చేపడుతున్న నిరసన బుధ వారం మూడో రోజుకు చేరుకుంది.