విజయనగరం నియోజక వర్గంలో జరుగుతున్న సర్ ప్రక్రియకు టీడీపీ తరపు న నియమితులైన బీఎల్ఏలు.. బీఎల్వోలకు సహకరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం మూతపడిన చక్కెర కర్మాగారా లపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు.
బొండపల్లి మండల కేంద్రం, దత్తిరాజేరు మండలంలో ని పెదమానాపురం పోలీసుస్టేషన్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదివారం సందర్శించారు.
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
What Next? ‘మావిగన్ అజెండాతో వచ్చే ఎన్నికల బరిలోకి దిగుతాం మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్ను చేరుస్తాం. ’ అని ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిస్థితేమిటోనని మథనపడుతున్నారు.
పల్లిగండ్రేడు (ఆర్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ఎ.సురేష్కుమార్ ‘స్మార్ట్బడి’ అనే యాప్ను రూపొందించారు.
Resolutions Yet to Reach జిల్లాలో ఆవాస్ ప్లస్ యోజన గృహ నిర్మాణాలకు గ్రామ సభల తీర్మానాలు అందడం లేదు. ఈ నెల ఏడో తేదీలోగా వాటిని అందించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు.
లింగాలవలస గ్రామం వద్ద గత నెల 30న గుర్తు తెలియని వాహనం ఢీకొని గాయపడిన బోర చిన్న(26) అనే యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు.
Just Nine Days Left జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పక్రియకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ వంద శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే శనివారం నాటికి ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది మాత్రం కేవలం 44.36 శాతమే.
మండలంలోని వేచలవానిపాలెం గ్రామంలో వేచలపు ఈశ్వరమ్మ(58) అనే మహిళ శనివారం విద్యుదాఘాతంతో మృతిచెందింది.