Come to the meeting with complete details ఈ నెల 4న జరగనున్న జిల్లా సమీక్ష సమావేశానికి అధికారులంతా సమగ్ర వివరాలతో హాజరుకావాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఆ సమావేశాన్ని సమర్థంగా నిర్వహించేందుకు జేసీ సేతుమాధవన్తో కలిసి మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు.
land rates hike at kottavalasa కొత్తవలస-గిడిజాల రోడ్డులో ఉన్న గ్రామాలకు మహర్దశ పట్టనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా గ్రామాలు విశాఖ జిల్లా ఆనందపురం మండలం, భీమిలి మండలానికి సరిహద్దు గ్రామాలుగా ఉండడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆనందపురం, భీమిలి మండలాలు ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకోవైపు ఆనందపురం మండలం తర్లువాడలోనే గూగుల్ డేటా సెంటర్కు ప్రభుత్వం భూమి కేటాయించింది. దీన్ని అనుసరించి మరిన్ని కంపెనీలు వస్తాయన్నది ప్రభుత్వ వర్గాల అంచనా.
rain effect వరి పంట కోతలు చేపట్టిన రైతులు, కోతలు పూర్తయిన వారు తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వానకు కలవరపడుతున్నారు. చిరు జల్లులైనప్పటికీ విరామం లేకుండా కురుస్తుండడంతో పంట సంరక్షణ చేయలేకపోతున్నారు
Is the will relaxed? పాలిథిన్ నిషేధాన్ని ఒకప్పుడు దిగ్విజయంగా అమలు చేసిన బొబ్బిలి మునిసిపాలిటీలో నేడు ప్లాస్టిక్ను విరివిగా వినియోగిస్తున్నారు. కాలుష్య నియంత్రణలో ఎంతో పేరు సంపాదించిన మునిసిపాలిటీ ఇప్పుడు అందుకు భిన్నంగా తయారైంది. ఎక్కడికక్కడే ప్లాస్టిక్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎందుకిలా? అని సగటు బొబ్బిలి పౌరుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Pollution కాలుష్యం... ప్రజలందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ప్రధాన కారకం. నివారణకు మానవ ప్రయత్నం జరుగుతున్నా అంతకు కొన్ని రెట్లు పెరుగుతోంది. వాయు, జల, భూమి కాలుష్యాలు ఎప్పుడో పరిమితిని మించిపోయాయి. జాతి భవిష్యత్ను అయోమయంలో పడేస్తున్నాయి.
జిల్లాలోని సముద్ర తీరంపై నిఘా కొరవడింది. దేశాలను దాటి మన జలాల్లోకి విదేశీ మత్స్యకారులు చేరుకుంటున్నా నిఘా వ్యవస్థ గుర్తించలేకపోతుంది.
Light Rain All Day దిత్వా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు కురిశాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం కురవగా.. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికందొచ్చిన పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
CM to Visit the District on the 5th ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 5న జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు భామిని ఏపీ మోడల్ స్కూల్కు చేరుకుంటారు.
Government Stands by the Poor కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సోమవారం సాలూరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు.
Need to Raise Awareness on AIDS హెచ్ఐవీ, ఎయిడ్స్పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా సోమవారం పట్టణంలో అవగాహన ర్యాలీని ప్రారంభించారు.