ఆస్తి వివాదంలో తోడబుట్టిన ఇద్దరు అన్నయ్య లపై ఓ తమ్ముడు చాకుతో దాడి చేసిన ఘటన మండ లంలోని కొండకిండాం గ్రా మంలో సోమవారం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు లు తెలిపారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోతు హుస్సేన్ నాయక్ పర్యటన వాయిదా పడడంతో గిరిజనులు ఊసూరుమ న్నారు.
They Don’t Acknowledge… Encroachments Won’t Stop జిల్లాలో విలువైన ప్రభుత్వ స్థలాలకు రక్షణ కొరవడింది. పల్లెల్లో చెరువులు, గ్రామ కంఠాలు, పోరంబోకు భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురువుతున్నాయి. వాటిని కాపాడాల్సిన రెవెన్యూశాఖ, గ్రామ పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు
Road Works Must Be Completed Within the Deadline గడువులోగా ఏజెన్సీ ప్రాంత రహదారి పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పిం చాలనే లక్ష్యంతో చేపడుతున్న రహదారి పనులపై నిర్లక్ష్యం పనికిరాదన్నారు. మెటీరియల్ సరఫరాలో లోపాలు లేకుండా చూడాలని, త్వరితగతిన నిర్మాణాల పూర్తికి అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.
Arrangements for Class 10 Evaluation జిల్లా కేంద్రంలో టెన్త్ మూల్యాంకనానికి (స్పాట్ వాల్యూయేషన్ ) విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల 6 నుంచి స్పాట్ వాల్యూయేషన్కు సర్వం సిద్ధం చేస్తున్నారు. పార్వతీపురంలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఇంగ్లీషు, సోషల్, డీవీఎం ఉన్నత పాఠశాలలో గణితం, సైన్స్కు సంబంధించి రెండు పేపర్లను దిద్దనున్నారు.
A Society Without Poverty is the Goal పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని, పీ-4తో బంగారు కుటుంబాలు తలరాతలు మారుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పీ-4 ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
Helmet Wearing is Not a Burden, It is a Responsibility హెల్మెట్ ఽధరించడం భారం కాదు బాధ్యతగా భావించాలని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సోమవారం పార్వతీపురం పట్టణంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులను ఎత్తేసిన పరిస్థితి ఏర్పడిందని హోం మంత్రి అనిత విమర్శించారు. వైసీపీ వాళ్లు వాటాలు, భాగస్వామ్యం అడిగారు కాబట్టి చాలా ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు.
Celebrate.. : టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. వాడవాడలా ఎన్టీఆర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.