Will They Come This Time? పార్వతీపురం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో పదకొండు దుకాణాల పరిస్థితేమిటో అర్థం కావడం లేదు. వాటిని అద్దె ప్రాతిపదికన కేటా యించేందుకు గత మూడేళ్లుగా సుమారు 20 సార్లు అధికారులు బహిరంగ వేలం పాట నిర్వ హించారు. అయినా ఎవరూ ముందుకు రాకపోవడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవు తున్నాయి.
Strict Action for Negligence గ్రామాల్లో పారిశుధ్యం, పార్క్ల నిర్వహణపై పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రభాకర్రెడ్డి హెచ్చరించారు. గురువారం నర్సిపురంలో పర్యటించారు. పార్క్లో పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు.
Accurate Land Re-survey రెవెన్యూ గ్రామాల్లో మూడో విడత రీసర్వేను పక్కాగా చేపట్టాలని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని జిల్లా ప్రత్యేకాధికారి (డిప్యూటీ డైరెక్టర్, మంగళగిరి) టి.శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. గురువారం తోటపల్లిలో నిర్వహిస్తున్న భూముల రీసర్వేను తనిఖీ చేశారు.
a hostal in old building ఆ వసతిగృహానికి ప్రభుత్వం నెలకు రూ.17 వేలు అద్దె చెల్లిస్తోంది. అంటే ఎంతో సౌకర్యంగా ఉంటుందనుకుంటున్నారు కదూ సౌకర్యం తర్వాత భవనం పైకప్పు కూలకపోతే చాలని అక్కడి విద్యార్థినులు ఆవేదనతో చెప్పారు. స్త్రీశిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని మహారాణిపేటలో నిర్వహిస్తున్న కళాశాల బాలికల వసతిగృహం శిథిలావస్థకు చేరింది.
To grow on par with other communities ఇతర వర్గాలతో పాటు ఎస్సీలు కూడా సమానంగా ఎదగేలా చూడాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అధికారులకు సూచించారు. ఎస్సీల పట్ల సానుభూతి కాకుండా వారి బాధలను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని సహానుభూతి చూపించాలన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
happy fishermans జిల్లాలో మత్స్య సంపద ఉత్పత్తి పెరుగుతోంది. గతంలో కంటే ఇప్పుడు చేపలు వినియోగించే వారి సంఖ్య పెరగడంతో మత్య్సకారులకు ఉపాధి కూడా పెరిగింది. వాటి ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. అనేక పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తున్నాయి.
అంధుల పాఠశాలలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపా రు. గురువారం విజయ నగ రంలోని పూల్బాగ్ కాలనీ మంగళవీధిలోని ప్రభుత్వ అంధుల పాఠశాలను పరిశీ లించి, సదుపాయాలు, సమ స్యలను అడిగి తెలుసుకున్నా రు.
: రైతులకు మేలు జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలిస్తున్నారని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు తెలిపారు. గురువారం మండలంలోని కోడూరు పంచాయతీలో వరిపంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం పంపిణీ చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సారిపాక సురేష్కుమార్, ఎలకల వెంకునాయుడు, సత్తిరాజు పాల్గొన్నారు.
mungeru people fire ముంజేరులోని సిద్దార్థ కాలనీ గురువారం రణరంగమైంది. మురుగు కాలువ నిర్మాణ విషయమై మొదలైన గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండువర్గాల వారు బాహాబాహీకి దిగారు. కారం, రాళ్లు విసురుకున్నారు. ఆ రాళ్లు పక్కనే ఉన్న పాఠశాల పిల్లల మధ్యాహ్న భోజనంలో పడి ఆహారం పాడైంది. కొట్లాటను చూసిన పిల్లలు భయపడిపోయారు.