జిల్లాను ఆర్గానిక్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. గిరిజన రైతులు సేంద్రీయ పంటలను సాగు చేసుకునేందుకు వ్యవసాయశాఖ ప్రోత్సహిస్తున్నది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అరకులోయ- అరకు మధ్య జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
మన్యంలో ముసురు వాతావరణం నెలకొంది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి జల్లులు మాత్రమే పడగా, పలు మండలాల్లో ఒక మోస్తరుగా వర్షం కురిసింది.
మండలంలోని గన్నెల పీహెచ్సీలో సంజీవని పైలట్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 29న రానున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
మండలంలోని బలపం పంచాయతీ బూరుగుబయలు వంతెన నిర్మాణంలో గిరిజన సంక్షేమశాఖ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.
ప్రైవేటు స్టీల్ప్లాంట్ నిర్వాసితుల కోసం మండలంలోని బోదిగల్లం ఆర్ఆర్ కాలనీలో చేపట్టిన వాటర్ ట్యాంకు నిర్మాణ పనుల్లో ఆదివారం అపశ్రుతి చోటుచేసుకుంది. ట్యాంకు శ్లాబ్ వేస్తుండగా డెక్కింగ్ కదిలిపోయి సిమెంట్ కాంక్రీట్ ఒక్కసారిగా జారిపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
మునిసిపాలిటీలో సొంత ఇళ్లు లేని పేదల కోసం బలిఘట్టం, పెదబొడ్డేపల్లి, గురందొరపాలెంలో నిర్మించిన ఇళ్ల కాలనీలకు తాగునీటి సరఫరా పథకాల నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3.06 కోట్లు, మునిసిపాలిటీ రూ.93 లక్షల చొప్పున మొత్తం రూ.7.05 కోట్లతో వివిధ రకాల పనులు జరుగుతున్నాయి. 2028 జనవరినాటికి పనులు పూర్తి చేసి కాలనీలకు నీటి సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.
అనకాపల్లి కేంద్రంగా నూతన జిల్లా ఏర్పడి నాలుగేళ్లు దాటినా.. జలవనరుల శాఖకు అనకాపల్లిలో పూర్తిస్థాయి జిల్లా కార్యాలయం ఏర్పాటు కాలేదు. ఈ శాఖకు సంబంధించి కీలక పనుల కోసం రైతులు ఇప్పటికీ చోడవరం లేదా విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతులు వ్యయప్రయాసాలకు గురవుతున్నారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదు అన్న చందంగా తయారైంది నర్సీపట్నం- తుని ప్రధాన రహదారి పరిస్థితి. ఈ రోడ్డు అభివృద్ధికి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నిధులు మంజూరు చేయించినప్పటికీ... టెండర్ ద్వారా పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టడం లేదు. దీంతో నర్సీపట్నం- తుని రోడ్డులో పలుచోట్ల ఏర్పడిన గోతులతో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ఆదివారం రాత్రి విడుదల చేశారు. జిల్లాలో 24 మండలాల్లో 646 గ్రామ పంచాయతీల పరిధిలో 6,276 వార్డులకు మొత్తం 6,344 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో 12,28,246 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,98,955 మంది పురుషులు, 6,29,274 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఉన్నారు. అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల వద్ద పంచాయతీల వారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను అందుబాటులో వుంచారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను ఈనెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలని, వీటిని పరిశీలించిన అనంతరం 31వ తేదీన తుది జాబితాలను వెల్లడిస్తామని డీపీఓ సందీప్ తెలిపారు.